RK Roja : మ‌ళ్లీ యాక్టివ్ అయిన రోజా.. జ‌గ‌న్ సంస్క‌ర‌ణ‌లే గ‌ట్టెక్కిస్తాయంటూ కామెంట్..

RK Roja : ఏపీలో దారుణాతి దారుణంగా ఓడిన త‌ర్వాత రోజా మ‌ళ్లీ క‌నిపించింది లేదు. ఆమె సోష‌ల్ మీడియాకి కూడా దూరంగా ఉంటూ వ‌చ్చింది. తాజాగా రోజా చేసిన ట్వీట్ ఇప్పుడు రాజ‌కీయాల‌లో హాట్ టాపిక్‌గా మారింది. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన సంస్కరణలే ఇప్పుడు విజయవాడ ప్రజలను గట్టెక్కిస్తున్నాయంటూ రోజా ట్వీట్ చేశారు. జగనన్న తీసుకొచ్చిన రేషన్ వాహనాలు, జగనన్న తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ, జగనన్న నియమించిన వలంటీర్ వ్యవస్థ, జగనన్న కట్టించిన రిటైనింగ్ వాల్, జగనన్న హయాంలో కొన్న 108, 104వాహనాలు, జగనన్న నియమించిన సచివాలయ ఉద్యోగులు, జగనన్న తీసుకొచ్చిన క్లీన్ ఆంధ్రా వాహనాలు,వజగనన్న తీసుకొచ్చిన వైఎస్సార్ హెల్త్ సెంటర్లే ప్రస్తుతం విజయవాడ ప్రజలను గట్టెక్కిస్తున్నాయంటూ రోజా ట్వీట్ చేశారు.

విజయవాడలో వరదలు అల్లకల్లోలం సృష్టించాయి.34 మంది వరకూ చనిపోగా.. లక్షల మంది వరదల కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. పంట నష్టం, ఆస్తి నష్టం ఎంతమేర అనేది తెలియాల్సి ఉంది. అయితే బుడమేరు వాగు సాగించిన విలయం నుంచి బెజవాడ వాసులు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. వరద నీరు తగ్గుముఖం పట్టడంతో నీటిలో మునిగిన తమ ఇళ్లను శుభ్రపరుచుకుంటున్నారు. ప్రభుత్వం కూడా ఫైరింజన్ల సాయంతో వీరి ఇళ్లను క్లీన్ చేయించే పనిలో ఉంది. అలాగే వరదల కారణంగా సర్వం కోల్పోవటంతో తక్షణ సాయంగా నిత్యవసర సరుకులను పంపిణీ చేస్తున్నారు. ఇక బాధితుల కోసం సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు భారీ విరాళాలు అందిస్తుండగా.. సామాన్యులు సైతం తమకు చేతనైనంత సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు.

RK Roja comments on cm ys jagan about his development works
RK Roja

అయితే విజయవాడ వరదలు, ప్రభుత్వ సహాయక కార్యక్రమాలు ఇలా ఉన్న నేపథ్యంలో మాజీ మంత్రి, వైసీపీ ముఖ్య నేత రోజా కీలక ట్వీట్ చేశారు. మరోవైపు విజయవాడ వరదలకు మీరంటే మీరు కారణమంటూ అధికార టీడీపీ కూటమి, విపక్ష వైసీపీ నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే వైఎస్ జగన్ చేపట్టిన సంస్కరణలే బెజవాడ వాసులను ఈ విపత్తు నుంచి గట్టెక్కిస్తున్నాయని రోజా చెప్తున్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం హయాంలో బుడమేరు వాగు ఆక్రమణకు గురైన అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదనేదీ టీడీపీ నేతల వాదన. మరోవైపు ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయడంలో విఫలమయ్యారనేదీ వైసీపీ ఆరోపణ. ఇదే సమయంలో వాలంటీర్లు ఉంటే ప్రజలను అప్రమత్తం చేసేవారని.. అలాంటి వాలంటీర్ వ్యవస్థను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

6 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

1 day ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago