Renu Desai : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ మరోసారి వెండితెరపై సందడి చేయబోతోంది. చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె.. రవితేజ లేటెస్ట్ మూవీలో ఓ పవర్ఫుల్ రోల్ తో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది.బద్రి సినిమాతో రేణు దేశాయ్ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆమెకు అదే మొదటి సినిమా. ఈ సినిమా సమయంలోనే పవన్ తో ప్రేమలో పడ్డ రేణు.. పవన్ కళ్యాణ్ ని పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత డివోర్స్ తీసుకుంది.ఇక అప్పటి నుండి సినిమాలకి కూడా దూరంగా ఉంది. ఇప్పుడు మాస్ మహారాజ్ రవితేజ తాజా సినిమా టైగర్ నాగేశ్వరరావు సినిమాలో ఆమె కీలక పాత్ర పోషిస్తోంది.
ఈ టైగర్ నాగేశ్వరరావు సినిమాలో హేమలత లవణం అనే పాత్రలో రేణు దేశాయ్ కనిపించబోతుందంటూ ఇది వరకే అనౌన్స్ చేసిన మేకర్స్.. రీసెంట్గా ఆమె లుక్ రివీల్ చేస్తూ ఈ సినిమా ట్రైలర్ అక్టోబర్ 3న రిలీజ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పోస్టర్ లో బిడ్డను ఎత్తుకొని కళ్లజోడుతో కనిపించింది రేణూ. ఈ లుక్ చూస్తుంటే సినిమాలో ఆమెది పవర్ ఫుల్ రోల్ అని తెలుస్తోంది. ఇది చూసి ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో రేణూకి తిరుగేలేదని అంటున్నారు నెటిజన్లు. అయితే తాజాగా సినిమా ప్రమోషన్స్ జోరందుకున్నాయి. ముంబై లో ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టిన చిత్ర బృందం సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇదే క్రమంలో రేణూ దేశాయ్ మూవీ గురించి చెబుతూ చిత్రం అన్ని భాషలలో రిలీజ్ అవుతుంది. ప్రేక్షకులని తప్పక అలరిస్తుందని మరాఠీలో చెప్పుకొచ్చింది. ఆ సమయంలో రవితేజ స్టన్నింగ్ రియాక్షన్ ఇచ్చాడు.
రేణు దేశాయ్ తెలుగు తెరపై సందడి చేసి దాదాపు 18 సంవత్సరాలు పూర్తయింది. మొన్నామధ్య ఓ మరాఠా సినిమాను తెరకెక్కించి నటించింది కానీ తెలుగు తెరపై మాత్రం ఇప్పటివరకు కనిపించలేదు. ఇన్నేళ్లకు ఇప్పుడు మాస్ మహారాజ్ రవితేజతో ఆమె స్క్రీన్ షేర్ చేసుకోనుండటం విశేషం.అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ టైగర్ నాగేశ్వరరావు సినిమాకి వంశీకృష్ణ దర్శకత్వం వహించారు. కొంతకాలం క్రితం ఇటు ప్రజలకు .. అటు పోలీసులకు కంటిపై కునుకు లేకుండా చేసిన స్టూవర్టుపురం గజదొంగ కథ ఇది. ఈ సినిమాతో తెలుగు తెరకి నుపూర్ సనన్ హీరోయిన్ గా పరిచయం కాబోతోంది.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…