Rayalaseema Ramanna Chowdary : కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం రాయలసీమ రామన్న చౌదరి. ఈ చిత్రం 15 సెప్టెంబరు 2000లో సురేష్ కృష్ణ దర్శకత్వంలో రూపొందింది. ఇందులో మోహన్ బాబు తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయగా జయసుధ, ప్రియాగిల్ వీరికి జంటగా నటించారు. మోహన్బాబు 500వ చిత్రంగా భారీ అంచనాలతో విడుదల అయిన ఈ సినిమా పరాజయం పాలు అయింది. 500వ సినిమాలకి దగ్గర అవుతున్న నేపథ్యంలో ఈ చిత్రంతో మంచి విజయం సాధించాలని మోహన్ బాబు ఎంతో కృషి చేశాడు. పరిచూరి బ్రదర్స్కు కథ బాధ్యతలు అప్పగించారు. దర్శకునిగా బి.గోపాల్ చేయమని అడగగా.. మహేష్ బాబు సినిమాతో చేస్తానని బి.గోపాల్ మాట ఇచ్చారు.
ఇక రజినీకాంత్ అయితే దేవుడి మీద సినిమా చేయాలని స్వయంగా తానే రెండు కథలు రాశాడు. బాబా తన వద్దనే ఉంచుకొని ఎప్పటి నుంచో సతమతమవుతున్న తన ఆప్తమిత్రుడు మోహన్బాబును రమ్మని రజినీ ఫోన్ చేశారు. రజినీకాంత్ కథ మొత్తం చెప్పి ఇది నీకు సూటవుతుందని చెప్పాడు. మీ స్టైల్లో మార్చి సినిమాను చేద్దామా అని పరుచూరి బ్రదర్ను అడిగారు మోహన్బాబు. అయితే రజనీకాంత్ రాసిన కథతో స్క్రిప్ట్ చేయాలి అనే సరికి వారికి కొత్తగా అనిపించింది. ఆ తర్వాత మాత్రం కథలో గొప్పతనం అర్థమై ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేశాడు పరుచూరి బ్రదర్స్.
పరుచూరి బ్రదర్కు ఈ స్టోరీ భలే నచ్చేసింది. రామన్న క్యారెక్టర్ జోడీగా జయసుధను తీసుకున్నారు. ఇక సెకండ్ మోహన్బాబు క్యారెక్టర్ను ముందుగా ఎవరైనా క్యారెక్టర్ ఆర్టిస్ట్ లేదా ఎవరైనా హీరోతో కానీ చేద్దాం అనుకున్నారు. ఫైనల్ గా ఆ క్యారెక్టర్ కూడా మోహన్ బాబే పోషించారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. అప్పట్లో రజినీకాంత్ చీఫ్ గెస్ట్ గా వచ్చి యూనిట్ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. తిరుపతి, రాజమండ్రి, రామానాయుడు స్టూడియో లలో చిత్ర షూటింగ్ పూర్తి కాగా, అప్పట్లోనే ఈ సినిమా కోసం 30 కెమెరాలను వాడారు. పాటల కోసం థాయ్లాండ్, మలేషియా వెళ్లారు. 3 కోట్ల బడ్జెట్తో నాలుగు నెలల వ్యవధిలోనే సినిమా పూర్తైంది. ఈ మూవీ షూటింగ్ సమయంలో గుర్రపు బండిమీద పడి మోహన్బాబు గాయపడడంతో ఆగస్టులో విడుదల చేద్దామనుకున్న మూవీ సెప్టెంబర్కు వాయిదా పడింది.అయితే ఈ సినిమా రిలీజ్ కోసం భారీ హంగామా చేసిన చివరికి చతికిల పడింది.
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…
గుంటూరు కారంతో చివరిగా పలకరించిన మహేష్ బాబు గత కొద్ది రోజులుగా రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో పాల్గొంటూ…