Ramya Raghupathi : గత కొద్ది రోజులుగా మళ్లీ పెళ్లి సినిమా ప్రమోషన్ లో భాగంగా నరేష్- పవిత్ర లోకేష్ తెగ హంగామా చేస్తుండడం మనం చూశాం. తమ లివింగ్ రిలేషన్ షిప్ నేపథ్యంలో మళ్లీ పెళ్లి అనే సినిమా చేయగా, విజయకృష్ణ మూవీస్ బ్యానర్పై నరేష్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.. ప్రముఖ ఫిలిం మేకర్ ఎంఎస్ రాజు దర్శకత్వం వహించారు. ఇక మే 26న (శుక్రవారం) ఈ సినిమా విడుదల అయింది. రీసెంట్ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో తమ రిలేషన్షిప్ గురించి అనేక విషయాలు చెప్పుకొచ్చాడు నరేష్. రిలీజ్ ముందు ఆయన మాజీ భార్య రమ్య రఘుపతి ఈ సినిమా విడుదలను ఆపాలంటూ కోర్టును ఆశ్రయించింది.
ఆ సినిమాలోని సన్నివేశాలపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఆమె.. ఈ మేరకు కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన ప్రతిష్టను కించపరిచేలా ఈ చిత్రంలో సన్నివేశాలు ఉన్నాయంటూ ఆమె ఆరోపించారు. అయితే అందరు కూడా సినిమా విడుదల కాకపోవచ్చని అనుకున్నారు. కాని మూవీ విడుదలై అందరి దృష్టిని ఆకర్షించింది. మూవీకి మిక్స్ డ్ రెస్పాన్స్ వస్తుంది. అయితే ఈ సినిమాకు తమ జీవితానికి ఎలాంటి సంబంధం లేదని, నరేష్ ఇంటర్వ్యూలలో చెప్పాడు. మళ్లీ పెళ్లి విడుదలకు ఒక్కరోజు ముందు రమ్య దానిపై కోర్టులో పిటిషన్ దాఖలు చేసి సినిమాని ఆపాలని ప్రయత్నించిన అది సాధ్యం కాలేదు.
నరేష్, పవిత్ర రిలేషన్షిప్ మీడియాలో వైరల్ అయిన తర్వాత రమ్య రఘుపతి వారిపై హోటల్లో దాడి చేయడం మనం చూశాం. ఇదే సమయంలో నరేష్, రమ్య తమ వ్యక్తిగత విషయాలపై ఓపెన్గానే విమర్శలు గుప్పించుకున్నారు. ఇటీవలే ఈ వివాదం కాస్త చల్లబడగా.. ‘మళ్లీ పెళ్లి’ సినిమాతో నరేష్ మళ్లీ వేడి రాజేశాడు. చిత్రంలో తన ప్రతిష్టను కించిపరిచేలా సన్నివేశాలు ఉన్నాయంటూ ఆరోపిస్తుంది రమ్య రఘుపతి. మళ్లీ పెళ్లి’ చిత్రంలో సీనియర్ నటులు జయసుధ, అన్నపూర్ణ, శరత్ బాబుతో పాటు అనన్య నాగళ్ల, వనిత విజయ్ కుమార్, భద్రం తదితరులు నటించారు. ఇక ఈ చిత్రానికి అరుల్ దేవ్, సురేష్ బొబ్బిల మ్యూజిక్ అందించగా.. అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించారు. ప్రేమలో పడేందుకు వయసుతో సంబంధంల లేదనే కాన్సె్ప్ట్తో ఈ మూవీ తెరకెక్కించారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…