Ram Pothineni And Ravi Teja : టాలీవుడ్ స్థాయి రోజు రోజుకి పెరుగుతూ పోతుంది. మంచి మంచి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. కొన్ని సినిమాలు టాలీవుడ్ స్థాయిని రవితేజ ‘మిస్టర్ బచ్చన్’, ఉస్తాద్ రామ్ పోతినేని ‘డబుల్ ఇస్మార్ట్’ థియేటర్లలోకి వచ్చాయి. రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధిస్తాయని అందరు ఊహించగా, అవి రెండు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ‘మిస్టర్ బచ్చన్’ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 31 కోట్లు. ‘డబుల్ ఇస్మార్ట్’ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 48 కోట్లు. హిందీ సినిమా ‘రైడ్’ స్ఫూర్తితో, అందులోని పాయింట్ తీసుకుని తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు, చేర్పులు చేసి ‘మిస్టర్ బచ్చన్’ తెరకెక్కించారు హరీష్ శంకర్. అయితే ఈ సినిమా బోల్తా కొట్టింది.
మొదటి రెండు రోజుల్లో ఏడు కోట్ల షేర్ రాబట్టింది. మూవీ బడ్జెట్లో కూడా ఈ మూవీ సగం రాబట్టడం కష్టంగానే మారింది. ఇండిపెండెన్స్ డే లాంగ్ వీకెండ్ను వాడుకుందామని డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్ వంటి రొటీన్ మాస్ కమర్షియల్ చిత్రాలు వచ్చాయి. వీటితో పాటు విక్రమ్ తంగలాన్ కూడా వచ్చింది. ఈ మూడింటితో పోటీ అని కాదు కానీ.. ఆయ్ అనే మరో సినిమా కూడా వచ్చింది. విచిత్రం ఏంటంటే.. మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్లు నెగెటివిటీతో బాక్సాఫీస్ వద్ద ఢమాల్ అన్నాయి. తంగలాన్ అంతో ఇంతో బెటర్గా పర్ఫామ్ చేస్తోంది. ఆయ్ మూవీ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది.
ఒకప్పుడు మంచి సినిమాలు చేసిన రవితేజ, రామ్లు ఎందుకు ఇలాంటి డిజాస్టర్ మూవీలు చేస్తున్నారు. మంచి టాలెంట్ ఉన్న వీరు ఇలాంటి బోరింగ్ మూవీలు చేయడం అభిమానులకి ఏ మాత్రం రుచిచండం లేదు. బోరింగ్ కంటెంట్లతో ప్రేక్షకులకి విసుగు తెప్పిస్తున్నారు. ‘మిస్టర్ బచ్చన్’ విజయం సాధించడం రవితేజకు ఎంత ముఖ్యమో… దర్శకుడు హరీష్ శంకర్ కు సైతం అంటే ముఖ్యం. కరోనా, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ముందుకు వెనక్కి వెళ్లడం వల్ల ఆయనకు గ్యాప్ వచ్చింది. పూరి జగన్నాథ్ కు ‘లైగర్’ డిజాస్టర్ నుంచి కోలుకోవడం కోసం ‘డబుల్ ఇస్మార్ట్’ హిట్ కావాలి. కాని ఏది జరగలేదు. ఇద్దరికి కూడా రెండు సినిమాలు మంచి విజయాలు అందిస్తాయని అందరు అనుకున్నా కూడా అవి ఊహించని విజయాన్ని అందుకోపోగా దారుణమైన పరాజయాన్ని తెచ్చిపెట్టాయి.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…