Ram Gopal Varma : వాల్తేరు వీరయ్య మూవీ 200 రోజలు ఫంక్షన్లో చిరంజీవి కొన్నిసంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా వాళ్లపై ఎందుకు పడి ఏడుస్తారు. ప్రజా సమస్యల గురించి మాట్లాడకుండా సినిమాల గురించి మాట్లాడడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. దీనిపై వైసీపీ నాయకులు ఎలా రియాక్ట్ అయ్యారో మనం చూశాం. ఇక తాజాగా రామ్ గోపాల్ వర్మ కూడా స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యసభలో విజయ్ సాయిరెడ్డి చేసిన కామెంట్స్ గురించా, లేదంటే బ్రో విషయంలోనా అనేది నాకు క్లారిటీ లేదు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నారు కాబట్టి ఆయన ఏపీ ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు. చిరంజీవి ఏ సందర్భం గురించి మాట్లాడారనేది తెలియడం లేదు అని వర్మ చాలా క్లారిటీగా సమాధానం ఇచ్చారు.
సోషల్ మీడియాలో మాత్రం చిరంజీవిపై తెగ సెటైర్స్ వేస్తున్నారు చిరు. మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ చిత్రం శుక్రవారం రోజు థియేటర్స్ లో విడుదలయింది. ఎవరిని ఈ చిత్రం అలరించలేకపోవడంతో భోళా శంకర్ పై ట్రోలింగ్ స్థాయి మరింత పెరిగింది. ఆ మధ్యన భోళా శంకర్ రిలీజ్ కి ముందు చిత్రు వాల్తేరు వీరయ్య 200 రోజుల వేడుకలో పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో చిరు ఎపి ప్రభుత్వంపై కొన్ని కామెంట్స్ చేశారు. ప్రజా సమస్యలపై ద్రుష్టి పెట్టకుండా టాలీవుడ్ పై ఏపీ ప్రభుత్వం.. పిచ్చుక పై బ్రహ్మాస్త్రం అన్నట్లుగా వ్యవహరిస్తోంది అంటూ ఘాటైన కామెంట్స్ చేశారు. అప్పటి నుండడి రాంగోపాల్ వర్మ చిరంజీవిని టార్గెట్ చేస్తూ ట్వీట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి వర్మ తన నోటికి పని చెబుతూ చిరంజీవిపై దారుణమైన ట్రోలింగ్ చేశాడు.
చిక్కిందే అవకాశం అన్నట్లుగా వర్మ వాల్తేరు వీరయ్య చిత్రం విజయం చిరంజీవి క్రెడిట్ కాదు అన్నట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. దీనికోసం రవితేజని పరోక్షంగా ఈ వివాదంలోకి లాగాడు. ‘ వాల్తేరు వీరయ్య చిత్రం ఎవరి మూలాన ఆడిందో , ప్రూవ్ చేయడానికే భోళా శంకర్ చిత్రం తీసినట్లు ఉన్నారు’ అంటూ వర్మ ట్వీట్ చేశారు. దీనితో మెగా ఫాన్స్ వర్మపై మండి పడుతున్నారు. చిరంజీవిపై ఈ స్థాయి విద్వేషం ఎందుకు అంటూ వర్మని ప్రశ్నిస్తున్నారు. వర్మ కూడా ఇండస్ట్రీ వల్లే ఎదిగిన వ్యక్తి అని గుర్తుంచుకోవాలని అంటున్నారు. అంతకు ముందు వర్మ.. జబర్దస్త్, హైపర్ ఆది లాంటి వారి పొగడ్తలకు అలవాటు పడి రియాలిటీకి దూరం అవుతున్నారు అంటూ కామెంట్స్ చేశాడు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…