Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్డమ్ని సంపాదించుకున్న విషయం తెలిసిందే. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్న రామ్ చరణ్ ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బిజినెస్లపై దృష్టి సారిస్తున్నాడు. చరణ్ గతంలో ఒక పోలో టీమ్ ని కొనుగోలు చేశాడు. ఆ తర్వాత ట్రూ జెట్ పేరుతో విమానయాన సంస్థను నడిపించాడు. ఓ వైపు నటిస్తూనే మెగా పవర్ స్టార్ నిర్మాతగా మారి సినిమాలను ప్రొడ్యూస్ చేశాడు. ఇలా విభిన్నరంగాల్లో రాణిస్తున్న చరణ్ తాజాగా క్రీడారంగంలో మరో అడుగుముందుకేశాడు.
ఐపీఎల్పై కన్నేసిన రామ్ చరణ్ వచ్చే ఏడాది ఓ కొత్త ఐపీఎల్ టీమ్ ను మనకు పరిచయం చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇందుకు సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయని..వచ్చే ఏడాది ఐపీఎల్ లో రాంచరణ్ ఫ్రాంచైజీ నుంచి వైజాగ్ వారియర్స్ టీమ్ అడుగుపెట్టనుంది. గత ఏడాది ఐపీఎల్ లో గుజరాత్, లక్నో ఫ్రాంచైజీలు అడుగుపెట్టాయి. తెలంగాణ నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఉంది కనుక ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఒక్క టీమ్ కూడా లేని కారణంగా రామ్ చరణ్ వైజాగ్ వారియర్స్ పేరిట ఒక కొత్త ఐపీఎల్ టీంని సిద్ధం చేయబోతున్నాడని టాక్.
ఇప్పటికే వందల కోట్ల పెట్టుబడితో షారుఖ్ ఖాన్, ప్రీతి జింటా, శిల్పా శెట్టి వంటి వారు పలు టీమ్ లకు ఫ్రాంచైజీ యజమానులుగా ఉన్నారు. ఐపీఎల్ బిజినెస్ అంటే వందల కోట్లలో ఆదాయం ఉంటుంది. అసలు ఐపీఎల్ ను మించిన బిజినెస్ మరొకటి లేదు. అందుకే రామ్ చరణ్ కూడా దీనిపై ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. ఇక సినిమాల విషయానికి వస్తే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తండ్రీ కొడుకులుగా భిన్నమైన నేపథ్యంలో రామ్ చరణ్ కనిపించబోతున్నారు. గేమ్ చేంజర్ అనే పేరు ఖరారు చేశారు. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. శంకర్ దర్శకత్వంలో సినిమా పూర్తిచేసిన తర్వాత ఉప్పెన ఫేం సానా బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ నటించనున్నాడు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…