Ram Charan : రామ్ చరణ్ సతీమణి ఉపాసన జూన్ 20న ఓ పండంటి బిడ్డకు జన్మను ఇచ్చిన సంగతి తెలిసిందే. జూన్ 23 మధ్యాహ్నం హైదరాబాద్లోని అపోలో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్బంగా రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమకు పుట్టిన బిడ్డను మీడియాకు చూపించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన మెగా ఫ్యాన్స్ తో పాటు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఈ ఆనంద సమయం వచ్చేసిందని, నిజానికి ఉపాసన తో పాటు తన ఆనందాన్ని కూడా మాటల్లో వర్ణించలేమని అన్నారు చరణ్. మాకు అందరి నుండి లభించిన బ్లెసింగ్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అని, అలానే ప్రత్యేకంగా మీడియా వారికి కూడా కృతజ్ఞతలు చెప్పారు చరణ్. కాగా రామ్ చరణ్ ఆనందంతో మాట్లాడిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక రామ్ చరణ్ తన ఇంట్లో కూతురితో సరదాగా గడుపుతున్నారు. ప్రస్తుతం షూటింగ్కి కూడా దూరంగా ఉన్న ఆయన కూతురితో సరదాగా గడుపుతున్నాడు.జూలై నుండి ఆయన సెట్స్ లో అడుగుపెట్టబోతున్నట్టు తెలుస్తుంది. త్వరగా షూటింగ్ పూర్తి చేసి ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకొని వేరే సినిమా చేయనున్నాడట. పుట్టిన బిడ్డకు ఆల్రెడీ ఓ పేరు డిసైడ్ చేసాము.. 21వ రోజు.. అధికారికంగా మీడియాకు తెలియజేస్తామంటూ తెలిపారు. ఈ సందర్బంగా మా కుటుంబం పట్ల ఇంత ఆదరణ చూపుతోన్న అభిమానులకు , మీడియా మిత్రులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసారు రామ్ చరణ్.
బిడ్డను అఫీషియల్గా చూపించినా.. ముఖాన్ని మాత్రం చూపించలేదు. అయితే రామ్ చరణ్, ఉపాసన దంపతుల పుట్టిన పాపకు తాతయ్య మెగాస్టార్ చిరంజీవి పోలికలు ఉన్నట్టు చూసినవాళ్లు చెబుతున్నారు.మెగా ప్రిన్సెస్ రాకతో మెగా ఫ్యామిలీలో సంబరాలు అంబారాన్ని అంటాయి .పెళ్లైన 11 యేళ్లకు పుట్టిన బిడ్డ కావడంతో రామ్ చరణ్, ఉపాసన దంపతులతో పాటు మెగా కుంటుంబంలో ఆనందం వెల్లి వెరిస్తోంది. అటు మెగా ఫ్యామిలీ అభిమానులు తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందిన రామ్ చరణ్, ఉపాసనకు స్పెషల్ విషెస్ తెలియజేస్తున్నారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…