Dhanush Parents : తమిళ స్టార్ హీరో ధనుష్ సొంత టాలెంట్తో ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు. విలక్షణమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ధనుష్ కొంతమంది హీరోల వలే మూస పాత్రలు కాకుండా సాధారణ మనషుల జీవితాలనే కథా వస్తువుగా మలుచుకుంటూ కమర్షియల్ పంథాలో సందడి చేస్తున్నాడు. ఇక ధనుష్ ఇటీవల తాను ఎంతో ఇష్టపడి కట్టించుకున్న ఇంట్లోకి అడుగుపెట్టారు. దీనికి సంబంధించిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ ఇంటి నిర్మాణాన్ని చేపట్టిన తర్వాత తన భార్య పిల్లలతో కలిసి ఇక్కడే నివసించాలనుకున్నారట ధనుష్.
అయితే కొన్ని కారణాల వల్ల ధనుష్ తన భార్య ఐశ్వర్యతో విడిపోవడంతో ఆ ఇంటిని ధనుష్ తన తల్లిదండ్రులకు బహుమతిగా ఇచ్చారంట. అయితే ఈ ఇంటిని రజనీకాంత్పై కోపంతో ధనుష్ కట్టినట్టు ప్రచారం జరిగింది. గతంలో రజినీకాంత్.. ధనుష్ తల్లిదండ్రుల్ని అవమానించారట. అది కూడా పోయస్ గార్డెన్లోని రజినీ ఇంట్లో ఉన్నప్పుడే అట. అందుకే ధనుష్ రజినీ ఇంటి పక్కన పోయస్ గార్డెన్లో ఇళ్లు కట్టుకున్నారట. రజినీకాంత్పై రివేంజ్ తీర్చుకోవటానికే ఈ ఇల్లు కట్టినట్లు సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్తల్లో ఎలాంటి నిజాలు లేవు. ఇవి కేవలం పుకార్లు మాత్రమే. ధనుష్ ఆ ఇల్లు కట్టుకోవటానికి అది కారణమని భావించటం మూర్ఖత్వం అని ఓ జర్నలిస్ట్ క్లారిటీ ఇచ్చారు.
ఇక ఈ ఇంటి కోసం ధనుష్ దాదాపుగా 150 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. సకల సౌకర్యాలతో, ఆధునిక హంగులతో ధనుష్ ఈ ఇంటిని నిర్మించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.. ధనుష్, రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కాగా పెళ్లైన 18 సంవత్సరాలకు ఈ జంట విడిపోయారు . ఇక రీసెంట్గా సార్ మూవీతో పెద్ద హిట్ కొట్టారు ధనుష్. వెంకీ అట్లూరి దర్శకత్వంలో బై లింగ్వల్ మూవీ చేసిన ధనుష్ సినిమా తమిళంలో ‘వాతి’ టైటిల్తో తెరపైకి రాగా, తెలుగులో ‘సార్’ పేరుతో విడుదలైంది. చిత్రం మంచి వసూళ్లతో దూసుకుపోతుంది.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…