Pushpa Sreevani : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రీసెంట్గా కురుపాం గ్రామంలో పర్యటించిన విషయం తెలిసిందే. పార్వతీపురం మన్యం జిల్లా… కురుపాం మండలంలో ఆయన విద్యార్థుల తల్లుల బ్యాంక్ అకౌంట్లలో అమ్మఒడి పథకం నాలుగో విడత నిధులు విడుదల చేశారు. పిల్లలందరినీ బడికి పంపించాలని కోరిన సీఎం జగన్ … విద్యారంగంలో 4 ఏళ్లుగా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని చెప్పారు. పిల్లలు అంతర్జాతీయ స్థాయిలో ఎదిగేందుకు వీలుగా ఎన్నో చర్యలు తీసుకున్నామన్నారు. గోరుముద్ద, నాడు నేడు కార్యక్రమాలతోపాటూ… పిల్లలకు ట్యాబ్స్ కూడా ప్రభుత్వం అందిస్తోందని జగన్ తెలిపారు. ఆడ పిల్లల కోసం స్వేచ్ఛ అనే పథకాన్ని తెచ్చామన్నారు.
ఇక అదే కార్యక్రమంలో పుష్ప శ్రీవాణి తన పవర్ ఫుల్ స్పీచ్తో అదరగొట్టింది. విపక్షాలపై అడుగడుగునా పంచులేస్తూ తన స్పీచ్తో అదరగొట్టింది శ్రీవాణి.విపక్షాలు అన్నీ కలసి జగన్ని టచ్ చేయాలని చూస్తున్నాయని కానీ ఆయన నీడను కూడా తాకలేరంటూ పుష్ప శ్రీవాణి స్పష్టం చేశారు. ఆరు కోట్ల మంది ఆంధ్రుల గుండెలలో జగనన్న గూడు కట్టుకుని ఉన్నారని ఆయనని సీఎం సీటు నుంచి అంగుళం కూడా కదల్చడం ఎవరి వలన కాదు అని శ్రీవాణి చెప్పుకొచ్చింది. మరోవైపు మాజీ సీఎం చంద్రబాబుకు ఆమె పంచులు పేల్చారు.
జగన్ పథకాలు ఆలోచనలను కాపీ కొట్టవచ్చేమో కానీ బాబూ జగన్ కమిట్ మెంట్ ని ప్రజల పట్ల ఉన్న ఆయన తపనను, ప్రతీ పధకాన్ని నిక్కచ్చిగా అమలు చేసే నైజాన్ని ఎప్పటికీ కాపీ కొట్టలేరని, అది ఆయన వల్ల కూడా కాదంటూ ఆమె స్పష్టం చేశారు. అటు యువగళం ఇటు నారాహి యాత్ర ఏదైనా కూడా జగన్ ప్రజా బలం ముందు బలాదూర్ అంటూ పుష్ప శ్రీవాణి అదరగొట్టింది. శ్రీవాణి మాటలకి ఆ ప్రాంగణంలో ఉన్న వారంతో చప్పట్ల వర్షం కురిపించారు. జగన్ సమక్షంలో ప్రతిపక్షాలకి గట్టిగా ఇచ్చి పడేశావు అంటూ వైసీపీ నాయకులు కూడా ఆమెని ప్రశంసిస్తున్నారు.
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…
గుంటూరు కారంతో చివరిగా పలకరించిన మహేష్ బాబు గత కొద్ది రోజులుగా రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో పాల్గొంటూ…