Prudhvi Raj : ఈ నడుమ ఏపీ రాజకీయాల్లో మాటలు హద్దులు దాటిపోయి ఒకరిపై ఒకరు దారుణమైన విమర్శలు చేసుకుంటున్నారు. ఒకరిపై ఒకరు వేసుకునే పంచ్ లు కూడా హద్దులు మీరుతున్నాయి.. ఇక గత కొంత కాలం నుంచి పవన్ మీద రోజా చేస్తున్న విమర్శలు ఎలా ఉంటున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. అయితే రోజాకు కూడా పవన్ అంతే గట్టిగా వార్నింగ్ లు ఇస్తూ వస్తున్నారు. ఏపీ ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ విమర్శలు మరింత పీక్స్కి చేరుకున్నాయి. ఈ క్రమంలోనే కమెడీయన్ పృథ్వీరాజ్ రోజాపై విరుచుకుపడ్డారు. గతంలో రోజా పవన్ని ఉద్దేశిస్తూ.. పెండ్లి చేసుకోవడానికి విశాఖ పట్నం అమ్మాయి కావాలి. కానీ రాజధానికి మాత్రం విశాఖ పనికి రాదా అంటూ దారుణంగా సెటైర్లు వేసింది. అయితే ఇదే కామెంట్ల మీద నటుడు పృథ్వీ కూడా దారుణంగా విమర్శలు గుప్పించాడు.
చూడమ్మా రోజా.. పవన్ భార్య విషయాన్ని నువ్వు వేలెత్తి చూపిస్తున్నావ్. మరి మొగుడు చెన్నైలో ఉంటున్నాడు మరి చెన్నైలో రాజధాని కడుతావా అంటూ దారుణంగా సెటైర్లు వేశాడు. ఇక తాజాగా మరోసారి రెచ్చిపోయాడు పృథ్వీ.జగన్ నాయకత్వం లేని నాయకుడు. జనసేన స్థాపించినప్పుడే పవన్ నన్ను ఆహ్వానించారు.వైసీపీలో నాకు అన్యాయం జరిగింది. బూతులు మాట్లాడి మానసికంగా దెబ్బ తీసే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ నాయకులు. వారు మాట్లాడుతుంటే మా వాళ్లు రెచ్చిపోతున్నారు. వెదవ జైలుకి వెళితే మరో సన్నాసి సపోర్ట్ చేస్తున్నాడు అంటూ రోజా మాట్లాడింది. అది ఎంత వరకు కరెక్ట్. ఇక వాసిరెడ్డి పద్మ మిడిల్ ఫింగిర్ చూపించింది. ఇది కరెక్టేనా. చెప్పాలి అని పృథ్వీ అన్నాడు.
బూతుల యూనివర్సిటీలు వైసీపీలు స్టార్ట్ చేసినవే. రానున్న రోజులలో మంచి ప్రభుత్వం వస్తుంది. ఇక పోసానికి సంస్కారం లేదు. అలాంటి వాడి గురించి మాట్లాడడం వేస్ట్. జనసేనలో అద్భుతమైన నాయకత్వం ఉంది. వారాహి నాలుగో విడత మొదలైంది. ఊసలు కదులుతున్నాయి. జనసేన ఏపీ రాష్ట్రాన్ని వణికిస్తుంది. తెలుగు దేశం కూడా తోడు కావడంతో రాష్రంలో ప్రభంజనం మొదలైంది. వైసీపీకి చరమగీతం మొదలైంది. టీడీపీ జనసేన కలిసాయి. ఇక రానున్న రోజులలో చాలా మార్పు వస్తుందని పృథ్వీరాజ్ అన్నారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…