Indians In USA : ప్రవాస భారతీయులకి కష్టాలు మొదలైనట్టేనని అర్ధమవుతుంది. చిన్నతనంలోనే తల్లిదండ్రులతో పాటు అమెరికా వెళ్లిన లక్షలాది మంది భారతీయుల యువతీయువకులు ప్రస్తుతం ఆ దేశబహిష్కరణకు గురయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు. శాశ్వత నివాసార్హత సాధించలేక తాత్కాలిక వీసాలు రాక స్వదేశానికి తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉందని అంటున్నారు.. అమెరికాలో ఇలాంటి వారిని డాక్యుమెంటెడ్ డ్రీమర్స్గా పిలుస్తారు. వీరి మొత్తం సంఖ్య 2.5 లక్షలకు పైనే ఉంటుంది. డాక్యుమెంటెడ్ డ్రీమర్స్లో భారతీయులే అత్యధికమని స్వయంగా వైట్ వర్గాలు చెప్పుకురావడం విశేషం. అయితే అమెరికా రూల్స్ ప్రకారం తల్లిదండ్రులతో పాటు అమెరికాకు వచ్చే చిన్నారులను వీసాదారులపై ఆధారపడ్డ వారిగా పరిగణిస్తారు.
21 ఏళ్ల వరకూ వారు దేశంలో ఉండేందుకు అనుమతి ఇస్తారు. ఆలోపు గ్రీన్ కార్డు దక్కితే చట్టబద్ధంగా అగ్రరాజ్యంలో కొనసాగే అవకాశం ఉంటుంది లేదంటే వారి వయస్సు దాటిందని చెప్పి గ్రీన్ కార్డు జాబితా నుంచి తొలగిస్తారు. దీన్ని ‘ఏజ్ ఔట్’గా పిలుస్తారు. ఆ తరువాత గ్రీన్ కార్డు లేదా వీసా కోసం సొంతంగా ప్రయత్నించాలి. ఇందులో విఫలమైతే స్వదేశానికి తిరిగి వెళ్లిపోవాలి. అమెరికాలో ప్రస్తుతం భారతీయులు వారి పిల్లలు సహా మొత్తం1.2 మిలియన్ల మంది వివిధ కేటగిరిల్లో దరఖాస్తు చేసుకుని గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తుండగా, కొందరు భారత సంతతికి చెందిన వారు అమెరికాలోని తమ కుటుంబాలను వీడి భారత్లో బంధువుల వద్ద తలదాచుకుంటున్నారు.
డాక్యుమెంటెడ్ డ్రీమర్స్ సమస్య పరిష్కారానికి రిపబ్లికన్స్ చట్టసభల్లో అడ్డుపడుతున్నారని వైట్ హౌజ్ తెలియజేసింది. అందరికి అనుకూలంగా బిల్లుని తీసుకొస్తే వాటికి రిపబ్లికన్స్ రెండు సార్లు అడ్డుగా నిలిచారని, మాకు వ్యతిరేఖంగా ఓటు వేసారని అన్నారు. గత నెలలో వివిధ పార్టీలకు చెందిన 43 మంది చట్టసభ సభ్యులు.. ఈ సమస్యకు పరిష్కారం కోరుతూ బైడెన్ ప్రభుత్వానికి లేఖ రాశారు. గ్రీన్ కార్డుల కోసం కొందరు దశాబ్దాల తరబడి వేచి చూస్తున్నారని, సమస్యకు తక్షణ పరిష్కారం కోసం ప్రయత్నించాలని సూచించారు. మరి రానున్న ప్రభుత్వంలో అయిన దీనికి పరిష్కారం అనేది దొరకుతుందా లేదా చూడాల్సి ఉంది.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…