Poonam Kaur : పంజాబీ ముద్దుగుమ్మ పూనమ్ కౌర్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. సినిమాల్లో హీరోయిన్ గా కన్నా కాంట్రవర్శీ కామెంట్లు చేయడంలో మోస్ట్ సక్సెస్ ఫుల్ పూనమ్ కౌర్. తన కామెంట్లతో నెట్టింట ఎప్పుడూ హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉంటుంది. ఆసక్తికర కామెంట్లు చేస్తూనే.. తెలివిగా తప్పించుకోవడంలో పూనమ్ రూటే సపరేట్. ఈ అమ్మడు పవన్ విషయంలో ఆమె చేసే కామెంట్లు తరచూ హాట్ టాపిక్ అవుతుంటాయి. ఇప్పుడు తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద ఈమె పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఇక పూనమ్ దానికి గురూజీ థింగ్స్ అంటూ హ్యాష్ట్యాగ్ను జతచేసింది.
‘‘ఆయన ఏదైనా చేసి తప్పించుకోగలడు. ఆయన చేసే తప్పు పనులను గుర్తించలేనంత గుడ్డివారు అయిపోయారు జనాలు. గత ప్రభుత్వంలో మామూలు ప్రజలకు తమ సమస్యలను చెప్పుకోవడానికి ముఖ్యమంత్రి ఆఫీస్కు వెళ్లలేనంత స్వేచ్ఛ ఆయనకు మాత్రమే ఉండేది. అది ఎందుకు అని నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంది’’ అంటూ ఒక వ్యక్తిపై ట్విటర్ ద్వారా ఆరోపణలు చేసింది పూనమ్ కౌర్. కానీ ఆ వ్యక్తి ఎవరు అని మాత్రం చెప్పలేదు. చివరిగా ‘గురూజీ థింగ్స్’ అంటూ హ్యాష్ట్యాగ్ పెట్టడంతో మరోసారి పూనమ్.. త్రివిక్రమ్ను టార్గెట్ చేస్తూ మాట్లాడిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. పూనమ్ కౌర్.. త్రివిక్రమ్పై ఆరోపణలు చేయాలనుకున్న ప్రతీసారి ఇలా గురూజీ హ్యాష్ట్యాగ్ను తన ట్వీట్స్కు జతచేరుస్తూ ఉంటుంది.
త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో మహేష్ అభిమానులు ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా కథను త్రివిక్రమ్ కాపీ కొట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ప్రముఖ వెబ్సైట్ ప్రకారం, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన గుంటూరు కారం కథ, సులోచనా రాణి నవలల నుండి ప్రేరణ పొందింది. గుంటూరు కారం కథాంశం సులోచనా రాణి ‘కీర్తి కీర్తనలు’ నవల నుంచి రూపొందించినట్లు తెలుస్తోంది. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్కి ఇది కొత్త కాదు. అంతకుముందు సులోచనా రాణి నవల మీనా ఆధారంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అప్పట్లో సులోచనా రాణికి టైటిల్స్ పెట్టలేదని కేసు కూడా పెట్టారు. త్రివిక్రమ్ క్రెడిట్ ఇవ్వకుండా ప్రతిసారీ తప్పులు చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే పూనమ్ కౌర్ ఇలా ట్వీట్ చేసిందని కొందరు ముచ్చటించుకుంటున్నారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…