Brother Anil Kumar : మరి కొద్ది నెలల్లో ఏపీలో ఎన్నికలు షురూ కాబోతున్నాయి. ఈ సారి ఎలాగైన వైసీపీని ఓడించాని టీడీపీ, జనసేన కంకణం కట్టుకోగా,బీజేపీ కూడా అందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇక ఇదే సమయంలో జగన్కి ధీటుగా ఆయన సోదరి షర్మిలని బరిలోకి దింపే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్. ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల వేళ అధికార వైసిపికి వైఎస్ షర్మిల పెద్ద తలనొప్పిలా మారారు. సొంత సోదరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కాదని కాంగ్రెస్ పార్టీలో చేరారు వైఎస్ షర్మిల. ఇక ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్ పులివెందులలో జగన్ ప్రత్యర్థి, టిడిపి నేత బిటెక్ రవితో భేటీ అయ్యారు. ఇలా షర్మిల, అనిల్ దంపతులు వైఎస్ జగన్ కు వ్యతిరేకంగా ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీని వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో షర్మిల తన పార్టీని హస్తం పార్టీలో కలిపేశారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ సమక్షంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకొని పార్టీలో చేరారు. ప్రధాని వేదికపై ఖర్గే, రాహుల్తో పాటు వైఎస్ షర్మిల, ఆమె భర్త బ్రదర్ అనిల్, కేసీ వేణుగోపాల్ తదితరులు ఉన్నారు. షర్మిల తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితాంతం కాంగ్రెస్ కోసం పనిచేశారన్నారు. అలాంటి పార్టీలో చేరటం పట్ల సంతోషంగా ఉందని అన్నారు. దేశంలోని అన్ని వర్గాలను ఒక్కటిగా నిలిపే శక్తి కాంగ్రెస్ పార్టీకే ఉందని అభిప్రాయపడ్డారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలన్నదే తన తండ్రి కోరికన్న షర్మిల.. పార్టీ ఏ పనిచేయమన్నా తాను సిద్ధమని స్పష్టం చేశారు. అండమాన్లో పనిచేయమన్నా చేస్తానని అన్నారు.
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ సమర్థించారు. షర్మిల పక్కనే ఆయన వేదికపై ఉన్నారు. బ్రదర్ అనిల్ మీడియాతో మాట్లాడుతూ… కాంగ్రెస్ కుటుంబంలో తాము కూడా సభ్యులమే అని.. ఈ దేశానికి మంచి జరుగుతుందని అన్నారు. పార్టీ హైకమాండ్ ఏ బాధ్యతలను అప్పగించినా షర్మిల స్వీకరిస్తారని, కాంగ్రెస్ కుటుంబంలో ఉండటమే తమకు ముఖ్యమని చెప్పారు. ఏపీలో కచ్చితంగా షర్మిల ప్రభావం ఉంటుందని అన్నారు. ఇక సీఎం జగన్ కు వ్యతిరేకంగా పని చేయమని హైకమాండ్ ఆదేశిస్తే పరిస్థితి ఏమిటని ప్రశ్నించగా… అధిష్ఠానం ఆదేశాల మేరకు షర్మిల పూర్తి స్థాయిలో పని చేస్తారని చెప్పారు.మరోవైపు జగన్ గురించి బ్రదర్ అనిల్ కీలక వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి.. షర్మిలను, తనను దూరం పెడుతూ వచ్చారని ఆయన అన్నట్లు తెలుస్తోంది. ఇక ఏపీ రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని షర్మిలకు ఆసక్తే లేదని.. విధిలేని పరిస్థితులు కల్పించడంతో ఇలా రావాల్సి వచ్చిందని అనిల్ వ్యాఖ్యానించినట్లు సమాచారం.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…