Payal Rajput : తెలుగు చిత్ర పరిశ్రమలోకి దర్శకులుగా ఎంతో మంది పరిచయం అయిన అందులో కొందరికే మంచి అవకాశాలు దక్కుతున్నాయి. అయితే ఫస్ట్ సినిమాతోనే సెన్సేషన్ హిట్ను అందుకున్న వాళ్లు తక్కువ మందే ఉన్నారు. వారిలో ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి ఒకరు. రియలిస్టిక్ స్టోరీతో సినిమాలు చేస్తోన్న అతడు.. ఇటీవలే ‘మంగళవారం’ అనే హర్రర్ థ్రిల్లర్ మూవీతో ఆడియెన్స్ను పలకరించాడు. ఈ మూవీని స్వాతి గుణుపాటి, సురేష్ వర్మ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో అజయ్ ఘోష్, నందిత శ్వేత, కృష్ణ చైతన్య, దివ్య పిళ్లై తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. ఈ మూవీకి అంజనీష్ లోక్నాథ్ సంగీతాన్ని అందించారు.
ఇండియాలోనే తొలిసారి భిన్నమైన కంటెంట్తో రూపొందిన ‘మంగళవారం’ సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయింది. దీంతో ఈ చిత్రం నైజాంలో రూ. 3.20 కోట్లు, ఆంధ్రప్రదేశ్, సీడెడ్ ఏరియాలను కలుపుకుని రూ. 7 కోట్లు, రెస్టాఫ్ ఇండియా, కర్నాటక, ఓవర్సీస్ ఏరియాల్లో కలిపి రూ. 2 కోట్లు బిజినెస్ చేసింది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 12.20 కోట్లు బిజినెస్ అయింది. అయితే ఈ సినిమా మంచి విజయం సాధించడంతో మూవీకి కూడా కలెక్షన్స్ బాగానే వస్తున్నాయి. ఈ క్రమంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ జరుపుకుంది. ఈ కార్యక్రమంకి యంగ్ హీరో విశ్వక్ సేన్ కూడా హాజరయ్యారు.
ఈవెంట్లో అజయ్ భూపతి మాట్లాడుతూ “సినిమాలో పాయల్ క్యారెక్టర్ను డీల్ చేసిన విధానం, పాయల్ నటన, నేపథ్య సంగీతం బావుందని అంటున్నారు. మహిళలు అందరూ వెళ్లి చూడాల్సిన సినిమా ’మంగళవారం’ అని చెబుతున్నారు. ఇది నిజంగా హ్యాపీగా ఉంది”అని తెలిపారు. అయితే పాయల్ స్టేజ్పైకి వెళుతున్న సమయంలో కాలు స్లిప్ అయి పడబోయింది. అప్పుడు యాంకర్ మంజూష జిష్టి తగిలింది. అందుకే అలా జరిగింది అని అనగా, పాయల్ కూడా నవ్వేసింది. ఇక ఈ కార్యక్రమంలో పాయల్, ప్రియదర్శి, బీవీఎస్ రవి, సిరాశ్రీ, తరుణ్ భాస్కర్, సురేష్ వర్మ, రవీంద్ర విజయ్, అజయ్ ఘోష్, శ్రీతేజ్, శ్రవణ్ రెడ్డి, కార్తీక్, లక్ష్మణ్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…