Pawan Kalyan : జనసేనాని పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో అధికారం లక్ష్యంగా ప్రచారంలో స్పీడ్ పె్చారు.. వారాహి యాత్ర మొదలు పెట్టిన పవన్ తన లక్ష్యం ఏంటో స్పష్టం చేస్తున్నారు . ఇన్నాళ్లు సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉన్న పవన్ ప్రస్తుతం రాజకీయాలపై దృష్టి సారించారు. జూన్ 14 నుండి వారాహి యాత్ర ప్రారంభించారు. ఈ క్రమంలో 2019 ఎన్నికల్లో జగన్ నమ్ముకున్న నినాదాన్నే ఇప్పుడు పవన్ ఎంచుకున్నారు. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ ఓటర్లను అభ్యర్ధిస్తున్నారు. పదేళ్ల పాటు అధికారం ఇవ్వాలని కోరుతున్నారు. పనితీరు బాగాలేదంటే రాజీనామా చేసి దిగిపోతామని చెప్పుకొచ్చారు.
2024, 2029లో కనుక మీరు జనసేనను నమ్మితే.. బంగారు ఆంధ్రప్రదేశ్గా మార్చి చూపిస్తానన్నారు పవన్. ఒక్క పదేళ్లు అవకాశం ఇవ్వాలని.. ఒకవేళ నచ్చలేదంటే తానే స్వయంగా దిగిపోతానని చెప్పారు. కుల రాజకీయాలకు స్వస్తి చెప్పే బాధ్యత జనసేన తీసుకుంటుందన్నారు. మోసగాళ్లను నమ్మి ప్రలోభాలకు గురికావొద్దని సూచించారు. అధికారంలోకి వచ్చాక రెండేళ్ల సమయం ఇవ్వాలని కోరిన పవన్ ..పనితీరు బాగాలేదంటే దిగిపోతామని చెప్పుకొచ్చారు. ఇప్పుడు పవన్ వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తికర చర్చకు కారణమవుతున్నాయి.
పవన్ కల్యాణ్ గత సమావేశాల్లో ఓపెన్ గా వచ్చే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీతో పొత్తులు ఉంటాయని చెప్పుకొచ్చారు. సీఎం పదవి కోరాలంటే..ఇతర పార్టీలు మనకు ఎందుకు ఇస్తాయని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలిపించాలని..అప్పుడు ముఖ్యమంత్రి సీటు గురించి మాట్లాడుదామంటూ ప్రతిపాదించారు. అయితే తాజా స్పీచ్ లో మాత్రం తాను కలిపి వస్తానో…ఒంటరిగా వస్తానో ఇంకా నిర్ణయించుకోలేదంటూ కొత్త అంచనాలకు కారణమయ్యారు. అటు బీజేపీ అగ్రనేతలు వైసీపీ ప్రభుత్వం పైన చేసిన ఆరోణలతో ఇప్పుడు అధికార పార్టీ నేతలు బీజేపీని టార్గెట్ చేస్తున్నాయి. దీని పైనా పవన్ ఇప్పటి వరకు స్పందించలేదు. పొత్తుల అంశంపై రానున్న రోజులలో క్లారిటీ ఇస్తాడని కొందరు చెప్పుకొస్తున్నారు.
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…