వన్డే ప్రపంచకప్ ప్రారంభం కావడానికి మరికొద్దిరోజుల సమయం ఉన్నప్పటికీ.. భారత్-పాక్ మధ్య వార్ మొదలైంది. వీసా సమస్యపై పీసీబీ ఐసీసీకి లేఖ రాసి బీసీసీఐకి ఫిర్యాదు చేయడంతో మార్గం సుగమం అయింది.సెప్టెంబరు 29న పాకిస్థాన్ తన తొలి వార్మప్ మ్యాచ్ ఆడాల్సి ఉండగా, భారత్కు రాలేకపోయింది. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఎట్టకేలకు వీసా వచ్చింది.పాక్ జట్టుకు భారత ప్రభుత్వం వీసా ఇచ్చినట్లు ఐసీసీ ధృవీకరించింది. వీసా రాకపోవడంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సోమవారం నాడు ఐసీసీకి అసంతృప్తిని వ్యక్తం చేయడంతో ఈ వార్త వచ్చింది. పాకిస్తాన్ తన మొదటి వార్మప్ మ్యాచ్ను సెప్టెంబర్ 29న ఆడాలి.
అయితే షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 27న హైదరాబాద్ చేరుకోవాలి. అయితే, ఇప్పటి వరకు పాకిస్థాన్ జట్టు, దాని సహాయక సిబ్బంది వీసా పొందలేకపోయారు. అయితే సోమవారం సాయంత్రం వీసాకు అనుమతి లభించింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధికార ప్రతినిధి ఒమర్ ఫరూక్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రపంచకప్నకు వీసాలు పొందడంలో ఎదురవుతున్న ఇబ్బందులపై బోర్డు ఐసీసీకి లేఖ రాసి ఆందోళన వ్యక్తం చేసింది. అతి పెద్ద టోర్నమెంట్లో పాల్గొనేందుకు వెళ్లాల్సిన సమయంలో పాక్ జట్టు ఈ ఇబ్బందులను ఎదుర్కోవడం చాలా బాధాకరమని పీసీబీ ఈ ప్రకటనలో పేర్కొంది. వార్మప్ మ్యాచ్కు ముందు మా ప్రణాళికలను పూర్తిగా మార్చుకోవాల్సి వచ్చిందని, ఎందుకంటే ఆటగాళ్లకు భారత్కు వెళ్లడానికి ఇంకా అనుమతి రాలేదని పీసీబీ తెలిపింది.
పాకిస్తాన్ చివరిసారిగా 2016లో టీ20 వరల్డ్ కప్ కోసం ఇండియాకి వచ్చింది.మళ్లీ ఇన్నీ రోజుల తర్వాత తిరిగి ఇండియాలో అడుగుపెట్టింది. అక్టోబర్ 14న భారత్ – పాక్ వరల్డ్ కప్లో పోటీ పడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పాకిస్తాన్ తన రెండు వార్మప్ మ్యాచ్లు, రెండు ఓపెనింగ్ లీగ్ మ్యాచ్లు హైదరాబాద్లో మాత్రమే ఆడాల్సి ఉంది. కాబట్టి, ఇప్పుడు జట్టు నేరుగా ఇక్కడకు రానుంది.
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…
గుంటూరు కారంతో చివరిగా పలకరించిన మహేష్ బాబు గత కొద్ది రోజులుగా రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో పాల్గొంటూ…