Niharika Konidela : మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ చివరిగా విరూపాక్ష చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద విజయం సాధించాడు. ఈ విజయంతో సాయిధరమ్ తేజ్కి ఫుల్ బూస్టింగ్ వచ్చింది. ఇక ఇదే ఉత్సాహంతో పవన్ కళ్యాణ్తో కలిసి బ్రో అనే చిత్రం చేశాడు. ఈ చిత్రం జూలై 28న విడుదల కానుండగా, గత కొద్ది రోజులుగా మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇటీవల ప్రమోషన్లో సరదాగా అభిమానులతో ముచ్చటించారు చిత్ర బృందం. తేజ్ వేదికపై మాట్లాడుతుండగా ‘‘పెళ్లి ఎప్పుడు?’’ అంటూ ప్రశ్నించారు. దానికి ఆయన ఫన్నీగా జవాబు చెప్పారు. ‘‘ఇంకెక్కడ పెళ్లి బ్రో. ఈ సినిమా ముందు వరకూ ఎవరో ఒకరు ట్రై చేేసవారు. కానీ, ఈ సినిమా టైటిల్ రిలీజ్ అయ్యాక అందరూ నన్ను బ్రో అని పిలుస్తున్నారు’’ అంటూ సాయిధరమ్ తేజ్ నవ్వులు పూయించారు.
బ్రో సినిమా నుండి సాయిధరమ్ తేజ్ పెళ్లిపై తెగ చర్చలు నడుస్తున్నాయి. ఆయనకు సంబంధించిన పాత వీడియోలు కూడా నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. మెగా హీరో వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ చిత్ర ప్రమోషన్స్లో సాయిధరమ్ తేజ్, నిహారిక, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ పాల్గొనగా, ఇందులో నిహారిక అందరిని ఫన్నీ ప్రశ్నలు అడిగింది. అందులో భాగంగా నువ్వు ఎప్పుడైన డేట్ కి వెళ్లావా అని అడగగా, అందుకు లేదని సమాధానం ఇచ్చాడు. అయితే సాయి ధరమ్ తేజ్ ఎన్ని సార్లు తను ప్రేమలో లేనని చెప్పిన కూడా ఆయా హీరోయిన్స్తో ప్రేమలో ఉన్నట్టు ప్రచారాలు నడుస్తూ ఉంటాయి.
బ్రో సినిమాలో తన గురువు పవన్ కళ్యాణ్ గారితో నటించడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పిన సాయి ధరమ్ తేజ్.. తనకు పవన్ అవకాశం ఇవ్వడం వల్ల ఈ సినిమాలో భాగం అయ్యాను అని వెల్లడించారు. దేవుడు నాకు ఇచ్చిన సెకండ్ ఛాన్స్ ఇది. దయచేసి మీరందరూ జాగ్రతగా ఉండండి. చాలా మంది హెల్మెట్ పెట్టుకోవడం లేదు. బైక్ డ్రైవ్ చేసేటప్పుడు హెల్మెట్ పెట్టుకోండి. మీరు క్షేమంగా ఉండాలని నేను కోరుకుంటున్నా’’ అని తేజ్ అన్నారు.ఇక ఈ మెగా హీరో ఆరు నెలల పాటు విశ్రాంతి తీసుకొని తర్వాత తిరిగి సినిమాలు చేయనున్నాడట.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…