Nara Lokesh : ప్రస్తుతం ఏపీలో రాజకీయం చాలా వాడివేడిగా సాగుతుంది. అధికారం కోసం పార్టీలు తెగ కుస్తీలు పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ప్రజలకు వరాల జల్లు కురిపిస్తున్నాయి. ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే ఉండటంతో యాత్రల పేరుతో ప్రజల మధ్యకు వెళ్తూ వారి సమస్యల్ని అడిగి తెలుసుకుంటున్నారు. తామను అధికారంలోకి తెస్తే మీ సమస్యలన్ని పరిష్కరిస్తామంటూ వాగ్దానాలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న టీడీపీని మరోసారి అధికారంలోకి తెచ్చేందుకు టీడీపీ నేత, ఆపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. 4వేల కిలోమీటర్ల పాదయాత్రలో సుమారు సగభాగం పూర్తి చేసుకోబోతున్నారు లోకేష్.
తాజాగా విద్యార్ధులతో కలిసి ఆయన ముచ్చటించగా, ఓ విద్యార్ధి ఏపీ రాజధాని ఏంటనేది తెలియక చాలా ఇబ్బంది అవుతుంది. దానికి మీరు సమాధానం చెప్పాలని అన్నారు. అయితే జగన్ వలన మద్యం బాగా పెరిగింది కాని, ఇక్కడ డెవలప్మెంట్ ఏమి లేదని చెప్పుకొచ్చారు. మీరు ఎవరైన ఏపీ రాజధాని ఏంటో చెబితే లక్షల రూపాయలు ఇస్తా అని లోకేష్ అన్నారు. ఇక యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ఏపీ ప్రజలకు లెక్కకు మించిన వాగ్దానాలు చేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే స్వయం ఉపాధి, ప్రైవేట్, ప్రభుత్వ రంగాల ద్వారా 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించారు.
గూడురు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ అక్కడి యువతతో ముఖాముఖి అయ్యారు. కాకువారిపాలెం క్యాంప్ సైట్లో విద్యార్ధులు, యువతతో ముచ్చటించిన నారా లోకేష్ టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో విద్యార్ధులకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని మాటిచ్చారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపి టీడీపీకి పట్టం కట్టాలని యువతను కోరారు లోకేష్. రాష్ట్రంలో వైసీపీ పాలనలో జగన్రెడ్డి తన ధనదాహం తీర్చుకోవడానికి ప్రకృతి వనరులను చాలా విధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీకి జగన్ కంస మామగా మారిపోయాడంటూ సంచలన ఆరోపణలు చేశారు లోకేష్.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…