Nadendla Manohar : ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. మంత్రులుగా ఎంపికైన వారందరు కూడా యాక్షన్లోకి దిగారు. ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రిగా నియమితులైన నాదెండ్ల మనోహర్ స్టాక్ పాయింట్ల తనిఖీలతో బిజీబిజీగా గడుపుతున్నారు. తాజాగా రేషన్ సరుకుల్లో అక్రమాలకు పాల్పడిన వారిని వదిలిపెట్టేది లేదని నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు. సరఫరాలో అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్నారు. పౌరసరఫరాలశాఖ మంత్రిగా నియమితులైన తర్వాత క్షేత్రస్థాయిలో స్టాక్ పాయింట్లను పరిశీలించిన మంత్రి.. అనేక అవకతవకలు ఉన్నట్లు గుర్తించారు. తూకాల్లో తేడాలు ఉన్నట్లు గుర్తించి సరఫరాదారులను హెచ్చరించారు. తెనాలిలో నిల్వగోదాములు తనిఖీ చేయగా పంచదార, కందిపప్పు, నూనె.. తదితర ప్యాకెట్ల బరువు 50 – 100 గ్రాములు తక్కువగా ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది.
అనంతరం, మంగళగిరిలో చేసిన తనిఖీల్లోనూ ఇదే బాగోతం వెలుగు చూసింది. దీంతో, పంచదార, నూనె తదితర ప్యాకెట్ల పంపిణీని నిలిపివేయాలని మంత్రి ఆదేశించారు. ఈ దోపిడీపై వారం రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఇది రాష్ట్రంలో బయటపడ్డ భారీ కుంభకోణమని అన్నారు. ఇటీవల తాను జరిపిన తనిఖీల్లో 24 చోట్ల అక్రమాలు జరిగినట్లు తేలిందని పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో విలేకర్ల సమావేశం నిర్వహించిన నాదెండ్ల మనోహర్.. క్షేత్రస్థాయి పర్యటనలో తనకు ఎదురైన అనుభవాలను వివరించారు. పౌరసరఫరాలశాఖ ద్వారా పంపిణీ చేసే సరకులకు తూకం వేయించారు. అనంతరం అవి బరువు తక్కువగా ఉన్నట్లు గమనించారు. అలాగే ప్యాకింగ్ లోపాలను సైతం గుర్తించారు.
అక్కడి సిబ్బంది పనితీరుపై ఆగ్రహం వక్తం చేశారు. తరువాత సంబంధిత అధికారుల నుంచి వివరాలు ఆరా తీశారు. రేషన్ సరుకుల్లో అక్రమాలకు పాల్పడిన వారిని వదిలిపెట్టేది లేదని నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు. సరఫరాలో అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పౌరసరఫరాల ద్వారా పేదలకు ఇచ్చే రేషన్.. నుంచి అంగన్వాడీ, వసతిగృహాలకు సరఫరా చేసే నిత్యావసరాల సరఫరాలోనూ భారీ ఎత్తున దోపిడీ జరుగుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. తూకం ఒక్కటే కాకుండా, ధరల్లోనూ వ్యత్యాసం ఉంటోంది. ఇదంతా అధికారులకు తెలిసే జరుగుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. వారి సహకారంతోనే ఇష్టారాజ్యంగా ఐదేళ్లుగా ఈ దోపిడీ సాగుతోందట. పామోలిన్, కందిపప్పు సరఫరాల్లోనూ రూ.200 కోట్లకు పైగా దోపిడీ జరిగింది. డీలర్లకు సరఫరా చేసే బస్తాల్లోనూ తూకం తేడా భారీగా ఉంటోంది. ఒక్కో బస్తా 5 – 8 కిలోల వరకూ బరువు తక్కువగా ఉంటోందని, అయినా, అధికారుల బెదిరింపులు, వేధింపులతో డీలర్లు కిమ్మనకుండా ఉండిపోతున్నారట.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…