OTT : ప్రతి వారం ఓటీటీలో ప్రేక్షకులకి సరికొత్త వినోదం అందుతుంది.అయితే ఎప్పటిలానే ఈ వారం కూడా ఈ వారం కూడా భారీగా సినిమాలు, వెబ్ సిరీస్లు ఓటీటీల్లో అందుబాటులోకి వస్తున్నాయి.. వీటిలో తెలుగు చిత్రాలతో పాటు పలు ఇంగ్లిష్-హిందీ సినిమాలు కూడా ఉన్నాయి. ఇక ఈ వీక్ అందరి దృష్టి షారుఖ్ ఖాన్ పఠాన్పైనే ఉంది. అలాగే కిరణ్ అబ్బవరం లేటెస్ట్ హిట్ వినరో భాగ్యము విష్ణుకథ కూడా ఈ వారమే స్ట్రీమింగ్ కానుంది. అలాగే చాలా రోజుల తర్వాత పంచతంత్రం సినిమా కూడా ఓటీటీలోకి వస్తుండడంతో ఈ సినిమాలపై ప్రేక్షకులు ఆసక్తిని కనబరుస్తున్నారు.
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం పఠాన్ మార్చి 22వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ కానుంది. ఇది హిందీ, తమిళం, తెలుగు, మలయాళం మరియు కన్నడ భాషల్లో ప్రసారం కానుంది. ఇక వినరో భాగ్యము విష్ణు కథలో కిరణ్ అబ్బవరం మరియు కాశ్మీర ప్రధాన పాత్రలు పోషించగా, ఈ చిత్రం ఇప్పుడు ఈ నెల 22న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఇక పురుష ప్రేతమ్ (మలయాళ సినిమా) మార్చి 24న సోని లివ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రంలో జయ జయ హే, హృదయం ఫేమ్ దర్శన రాజేంద్రన్ ప్రధాన పాత్రలు పోషించారు.
ఇక వాకో: అమెరికన్ అపకాలిప్స్ (ఇంగ్లిష్ సిరీస్) మార్చి 22 నుండి స్ట్రీమింగ్ కానుంది. 1993లో ఫెడరల్ ఏజెంట్లు మరియు భారీ సాయుధ మత సమూహం మధ్య జరిగిన యుద్ధం నేపథ్యంలో ఈ డాక్యుమెంటరీ రూపొందింది. ఇక ద నైట్ ఏజెంట్ (ఇంగ్లిష్ సిరీస్) – మార్చి 23, చోర్ నికల్ కే భాగా (హిందీ సినిమా) – మార్చి 24, హై & లో ద వరస్ట్ ఎక్స్ (కొరియన్ సినిమా) – మార్చి 25, క్రైసిస్ (ఇంగ్లిష్ సినిమా) – మార్చి 26న నెట్ ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానున్నాయి.
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…
గుంటూరు కారంతో చివరిగా పలకరించిన మహేష్ బాబు గత కొద్ది రోజులుగా రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో పాల్గొంటూ…