Mokshagna : ఇప్పటికే స్టార్ హీరో కొడుకులు సినీ పరిశ్రమకు పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బాలకృష్ణ తనయుడి గురించి ఎప్పటి నుండో ప్రచారాలు నడుస్తున్నాయి. ఈయన ఫలానా దర్శకుడి డైరెక్షన్లో తెరంగేట్రం చేయనున్నాడని వార్తలు హల్చల్ చేస్తుండగా,తాజాగా స్పందించాడు. మోక్షజ్ఞను దర్శకుడు బోయపాటి శ్రీను లాంచ్ చేయనున్నారంటూ వస్తోన్న వార్తలపై బాలకృష్ణ మాట్లాడుతూ.. ”అంతా దైవేచ్ఛ” అని నవ్వి ఊరుకున్నారు. ఆ సమయం వచ్చినప్పుడు ఎంట్రీ అలా జరిగిపోతుందని, ఆ దేవుడి అనుగ్రహం లేనిదే ఏదీ జరగదని, ఆ సమయం రావాలని, అప్పటివరకూ మనమంతా వెయిట్ చేయాలంటూ బాలయ్య మాట్లాడడంతో ఇప్పుడు అందరిలో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.
మోక్షజ్ఞ ఎంట్రీపై గతంలో మీడియాలో చర్చలు కూడా జరిగాయి. మోక్షజ్ఞని బాలయ్యే డైరెక్ట్ చేయనున్నట్టు ప్రచారం జరగగా, దానిపై స్పందించిన బాలయ్య ఎప్పుడు ఎవరు డైరెక్ట్ చేస్తారో తెలియదు అన్నారు. ఏదేమైన మోక్షజ్ఞ బోయపాటి శ్రీను దర్శకత్వంలోనే ఎంటీ ఇస్తాడా లేక మరో దర్శకుడితో వస్తాడా అనేది మాత్రం అభిమానులని సస్పెన్స్ లో పడేస్తూనే ఉంది.
బాలకృష్ణ కుమారుడి సినిమా రంగ ప్రవేశంపై ఎప్పటికప్పుడు వార్తలు వస్తున్నప్పటికీ బాలకృష్ణ మాత్రం ఎప్పుడూ స్పందించలేదు. గోవా ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొన్న సందర్భంగా తొలిసారి కుమారుడి సినిమాపై మాట్లాడి గాసిప్స్ కు చెక్ పెట్టారు అనే చెప్పాలి.. విలేకరులు ఈ ప్రశ్నలు అడిగే సమయంలో దర్శకుడు బోయపాటి శ్రీను బాలకృష్ణ పక్కనే ఉండగా, ఆ సమయంలో అతని బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లుగా ఏ దర్శకుడు సెట్ అవుతారో వారే పరిచయం చేస్తారుకానీ నేనే లాంచ్ చేస్తానని గ్యారంటీగా చెప్పలేనన్నారు. ఇక బాలకృష్ణ త్వరలో అఖండ 2 మూవీ కూడా రానుందని తెలియజేయడం విశేషం. ఇ ప్రస్తుతం టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీర సింహా రెడ్డి అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…