Pakeezah : వాసుకి అంటే పెద్దగా గుర్తు పట్టకపోవచ్చు కాని పాకీజా అంటే ప్రతి ఒక్కరు గుర్తు పడతారు. ఒకప్పుడు మంచిగా ఓ వెలుగు వెలిగిన పాకీజా ఇటీవల తన బాధలని చెప్పుకొచ్చింది. కనీసం కడుపు నింపుకోవడానికి రెండు ఇడ్లీలు కూడా కొనుక్కునే స్థితిలో లేనని చెప్పి తన దీనస్థితిని చెప్పుకుని కన్నీళ్లుపెట్టుకుంది. ఆ సమయంలో మెగా బ్రదర్ నాగబాబు ఫోన్ చేసి మరీ.. ఆమెకు లక్షరూపాయల సాయం చేశారు. ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా లక్ష రూపాయిల ఆర్ధికసాయం అందించడంతో పాటు.. ఆమెకు సినిమాలు, సీరియల్స్లో అవకాశాలు ఇవ్వాలనికోరారు.
తెలుగుతో పాటు తమిళ్ భాషల్లో కలిపి 150 సినిమాలు చేసిన పాకీజా కి తాజాగా మా అధ్యక్షుడు మంచు విష్ణు పాకీజాకు సాయం చేసి మంచి మనసు చాటుకున్నాడు. ఈ విషయాన్ని నటి కరాటే కల్యాణి సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. పాకీజా గారి పరిస్థితి చూసి ఆవిడ మా అసోసియేషన్ కార్డ్కి తన సొంత డబ్బులు కడుతున్న మంచు విష్ణు ఇప్పుడు ఆవిడకి అవసరం. థాంక్యూ బాబు.. నా మాట పోల్లుపోలేదు’ అంటూ పోస్ట్ పెట్టింది కరాటే కల్యాణి. కాగా పాకీజా కష్టాల్లో ఉందని తెలుసుకున్న మోహన్ బాబు.. స్వయంగా ఆమెతో ఫోన్ లో మాట్లాడారట. తాను అమెరికాలో ఉన్నానని ఇండియా రాగానే సాయం చేస్తానని మాట కూడా ఇచ్చారట.
ఇక మంచు విష్ణు తన సొంత డబ్బులతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్డ్ పాకీజాకి అందించారట. కాగా మా అసోసియేషన్ కార్డుకు గతంలో రూ. లక్ష రూపాయలు ఉండేది. కానీ ప్రస్తుతం దానిని రూ. 90 వేలకు తగ్గించారు. ఇప్పుడు ఈ అసోసియేషన్ కు కట్టాల్సిన 90 వేల రూపాయలను మంచు విష్ణు చెల్లించి, ఆమెకు కార్డు ఇస్తాడు అని కరాటే కల్యాణి చెప్పుకొచ్చింది. అంటే మా అసోసియేషన్ ద్వారా లభించే అన్ని సౌకర్యాలు పాకీజా కుటుంబానికి అందుతాయి. ఏదేమైన ఆమెకు తమిళనాట పెద్దగా సాయం అందకపోయిన మన టాలీవుడ్ స్టార్స్ నుండి సాయం అందడం గొప్ప విషయంగా చెప్పాలి.
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…