Manchu Vishnu : సినిమా పరిశ్రమలో మంచు ఫ్యామిలీకి ప్రత్యేక గుర్తింపు ఉందనే చెప్పాలి. మోహన్ బాబు వలన మంచు ఫ్యామిలీకి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. దానిని మంచు హీరోలు నిలబెట్టలేకపోయారు. విష్ణు, మనోజ్ పలు సినిమాలు చేసినా పెద్దగా హిట్స్ కాకపోవడంతో వారి కెరియర్ సజావుగా సాగడం లేదు. అయితే మంచు విష్ణు తాజాగా నటించిన చిత్రం జిన్నా. రైటర్ కోన వెంకట్, డైరెక్టర్ సూర్య కాంబినేషన్లో పని చేస్తున్నారు. కాగా ఈ టీజర్ రీసెంట్గా విడుదల కాగా ఈ కార్యక్రమంలో మంచు విష్ణు పలు క్రేజీ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ వలన ఆయనను దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.
ఈవెంట్లో విష్ణు మాట్లాడుతూ.. జిన్నా నా మనసుకి దగ్గరైన సినిమా. ఇందులో ఎన్నో విశేషాలు ఉన్నాయి. నా బంగారు తల్లులు అరియనా, విరియానా పాట పాడారు. వాళ్ళతో పాడించినందుకు బిగ్ థాంక్స్. మా నాన్నగారు కోన వెంకట్ గారిని బాబాయ్ అని పిలిస్తే, నేను మాత్రం బ్రదర్ అని పిలుస్తాను. ఈ సినిమాలో నా కంటే ముందు సన్నీనే ఫైనల్ చేశారు. కానీ ఇక్కడ సన్నీని ఎలా రిసీవ్ చేసుకుంటారని భయం ఉండేది. ఢీ ఇచ్చిన శ్రీను వైట్ల గారి తర్వాత నన్ను అంతలా మెప్పించాడు డైరెక్టర్ సూర్య. హీరోయిన్ గా పాయల్ అనగానే.. ఒకవైపు సన్నీ, మరోవైపు పాయల్ ఇక నన్ను ఎవరు చూస్తారు అనుకున్నా.. అని అన్నారు. అయితే ప్రెస్ మీట్లో మంచు విష్ణు కన్నా సన్నీ లియోన్నే ఎక్కువ ప్రశ్నలు వేశారు.
ఈ క్రమంలోనే ఈ కథ ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ ఏమైనా ఉందా..? అని అడగ్గా సన్ని లియోన్ మాట్లాడుతూ.. అఫ్ కోర్స్ ఇది చాలా కొత్త.. డిఫరెంట్ కదా.. స్టోరీలో ట్విస్ట్ లు చాలా బాగుంటాయి. ఇలాంటి కథను చేస్తున్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇక మంచు విష్ణు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. ఆయనలో మంచి నటుడు ఉన్నారు అని సన్నీలియోన్ చెబుతుండగా, మధ్యలో నిన్ను ముద్దు పెట్టుకోవచ్చా అని సన్నీలియోన్ ని అడిగాడు విష్ణు. దీనికి సన్నీలియోన్ కూడా కాస్త షాక్ అయి.. మంచు విష్ణు చాలా నాటీ.. మీకు తెలిసి ఉంటుంది కదా.. అంటూ కవర్ చేసుకొచ్చింది. మంచు విష్ణు ప్రవర్తనపై నెటిజన్స్ దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు దారుణంగా ట్రోల్స్ కూడా చేస్తున్నారు.
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…