Manchu Lakshmi : మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆమె విదేశాలలో చదువుకొని మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. ఇక్కడకి వచ్చాక నటిగా, హోస్ట్గా కూడా తన టాలెంట్ చూపించింది. అయితే మంచు లక్ష్మీ ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. ఆమె చేసిన నెటిజన్స్ ట్రోల్స్ చేస్తూనే ఉంటారు. అయితే తాజాగా ఓ మంచి పనికి శ్రీకారం చుట్టింది మంచు లక్ష్మీ .టీచ్ ఫర్ చేంజ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జోగులాంబ గద్వాల జిల్లాలోని 30 ప్రభుత్వ పాఠశాలలను మెరుగైన విద్యను అందించేందుకు దత్తత తీసుకునేందుకు ఆ సంస్థ ఫౌండర్, సినీనటి లక్ష్మీ మంచు ముందుకు వచ్చారు.
గద్వాలలో జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతితో మంచు లక్ష్మి సమావేశమయ్యారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ విద్య, కంప్యూటర్ క్లాస్ తదితర మౌళిక వసతులు కల్పించనున్నట్లు ప్రకటించారు. జోగులాంబ గద్వాల జిల్లాలో 30 ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకొని అభివృద్ధి చేయడానికి బుధవారం జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతితో ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. ఆయా పాఠశాలలకు డిజిటల్ బోధన కోసం ఇప్పటికే మెటీరియల్ సిద్ధం చేసినట్లు తెలిపారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో 56 పాఠశాలలను దత్తత తీసుకొని ఇప్పటికే విజయవంతం చేయడం జరిగిందన్నారు. వెనుకబడిన జిల్లాలను ఎంచుకొని ఈ కార్యక్రమాలు తమ స్వచ్చంద సంస్థ ద్వారా అభివృద్ధి చేపట్టడం జరుగుతుందని, అందులో భాగంగా గద్వాల జిల్లాకు రావడం జరిగిందన్నారు. 2014లో స్థాపించబడిన టీచ్ ఫర్ చేంజ్ సంస్థ ప్రభుత్వ పాఠశాలలో విద్య నాణ్యతను మెరుగుపరచడమే లక్ష్యంగా కొనసాగుతోంది. అంతేకాదు ఫ్లాగ్షిప్ వాలంటీర్ ప్రొగ్రామ్, స్మార్ట్ క్లాస్ రూమ్ల నిర్వహణ, ప్రభుత్వ పాఠశాలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలు తదితర అంశాల కోసం అవిశ్రాంతంగా కృషిచేస్తోంది. ప్రస్తుతం 248 ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న 42 ,080 మంది విద్యార్థులు ఈ సంస్థ నుంచి లబ్దిపొందుతున్నారని మంచు లక్ష్మి తెలియజేశారు. అయితే మంచు లక్ష్మీ తెలుగు మాట్లాడిన తీరుపై కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…
గుంటూరు కారంతో చివరిగా పలకరించిన మహేష్ బాబు గత కొద్ది రోజులుగా రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో పాల్గొంటూ…
ఏపీలో వరదలు సృష్టించిన వినాశనం అంతా ఇంతా కాదు. ఎంతో మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. కొందరు ఇప్పటికీ దిక్కుతోచని స్థితిలో…
YS Jagan : ఈ ఎన్నికలలో ఘోరంగా ఓడిన జగన్ ప్రతి సందర్భంలో ప్రభుత్వంపై ఏదో ఒక విధంగా విమర్శలు…
Harish Rao : తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం, ఇష్టమొచ్చినట్టు…
గత ప్రభుత్వంలో నాసిరకం మద్యం వలన చాలా మంది చాలా ఇబ్బందులు పడ్డారు.అయితే వైసీపీ ప్రభుత్వం మద్యం విధానాన్ని అస్తవ్యస్తం…
YS Sharmila : వైఎస్ షర్మిళ ఇటు తెలంగాణ, అటు ఏపీలో నిప్పులు చెరుగుతూ దూసుకుపోతుంది. ఇన్నాళ్లు సొంత అన్న…