Mainampalli Hanumantha Rao : తెలంగాణ సహా ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోయే అయిదు రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉంది కాంగ్రెస్ పార్టీ. దీనికి అనుగుణంగా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను ఎగ్జిక్యూట్ చేయడానికి కసరత్తు చేస్తోంది. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న రాజస్థాన్, ఛత్తీస్గఢ్లల్లో అధికారాన్ని నిలబెట్టుకోవడంతో పాటు తెలంగాణ, మధ్యప్రదేశ్, మిజోరంలల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన వ్యూహాలను రూపొందిస్తుంది. అయితే ముఖ్యమైన నాయకులని కూడా కాంగ్రెస్ తన పార్టీలోకి ఆహ్వానిస్తుంది. తాజాగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకిలోకి భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ సీనియర్ నేత, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మారారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తన కుమారుడు రోహిత్తో కలిసి సెప్టెంబర్ 28 గురువారం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, ఆ పార్టీ తెలంగాణ చీఫ్ ఎ రేవంత్ రెడ్డి సమక్షంలో అధికారికంగా కాంగ్రెస్లో చేరారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా ఈరోజు పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పనితీరులో ప్రజాస్వామ్యం, పారదర్శకత లేదని ఆరోపిస్తూ హనుమంతరావు ఇటీవల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావుకు రాజీనామా లేఖను అందించిన విషయం తెలిసిందే. అధికార దాహంతో ఉన్న కొంతమంది వ్యక్తుల చేతుల్లో బీఆర్ఎస్ కీలుబొమ్మగా మారిందని హనుమంతరావు ఆరోపించిన సంగతి తెలిసిందే. తన కుమారుడికి ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వడానికి అగ్ర నాయకత్వం నిరాకరించడంతో ఆయన బీఆర్ఎస్ నుంచి వైదొలిగినట్లు సమాచారం.
2018 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో మైనంపల్లి.. మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ చీఫ్, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవలే విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలోనూ ఆయన పేరు ఉంది. అదే సమయంలో ఆర్థిక శాఖ మంత్రి టీ హరీష్ రావుతో నెలకొన్న విభేదాల కారణంగా బీఆర్ఎస్ నుంచి బయటికి రావాల్సి వచ్చిందాయనకు. కొద్దిరోజుల కిందటే బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. తాజాగా కుమారుడితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణలో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకుని రావడం, హరీష్ రావును మట్టికరిపించడమే తన లక్ష్యమని వ్యాఖ్యానించారాయన.
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…
గుంటూరు కారంతో చివరిగా పలకరించిన మహేష్ బాబు గత కొద్ది రోజులుగా రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో పాల్గొంటూ…