Lu Lu Mall: గత సంవత్సరం దావోస్లో జరిగిన “ప్రపంచ ఆర్థిక సదస్సు “పర్యటన సందర్భంగా తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ యూఏఈ ప్రఖ్యాత సంస్థ లూలు గ్రూప్ తో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. చర్చల అనంతరం హైదరాబాద్ లో లులు షాపింగ్ మాల్ ఏర్పాటునకు ఆ సంస్థ తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ క్రమంలో హైదరబాద్ కూకట్ పల్లిలో షాపింగ్ మాల్ ఏర్పాటు చేశారు. గతంలో కూకట్పల్లిలోని మంజీరా మాల్ ను లులు గ్రూప్ రీబ్రాండ్ చేసింది.ఈ లులు గ్రూప్ షాపింగ్ మాల్ 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఈ మాల్ ను రీసెంట్గా మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.సాధారణంగానే నగర వాసులు కొత్తగా ఏర్పాటైన ఏ మాల్ని వదిలి పెట్టరు.
అయితే ఇప్పుడు ఈ లుల్ మాల్కి మాత్రం తాకిడి విపరీతంగా పెరిగింది. మూడు రోజుల సెలవుల కారణంగా చాలామంది లులు మాల్ ను సందర్శిస్తున్నారు. మాల్ కు వచ్చే ప్రేక్షకుల కారణంగా కూకట్ పల్లిలో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. శనివారం రోజు ఏకంగా మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. జేఎన్టీయూ నుండి హైటెక్ సిటీ వెళ్లే మార్గంలో లులు మాల్ నూతనంగా ఏర్పాటయింది. ఈ మాల్ ఓపెనింగ్ రోజు సైతం విపరీతమైన ప్రచారం లభించింది. అటు సోషల్ మీడియాలోనూ ఈ మాల్ పై విపరీతమైన చర్చ నడవడంతో… ఒకసారైనా ఈ మాల్ కు వెళ్లాలని నగరవాసులు ఎగబడుతున్నారు. వీకెండ్ కావడంతో మాల్ కు ఒక్కసారిగా జనం పోటెత్తారు.
మూడు రోజుల సెలవులు కావడంతో ఊర్లకు వెళ్లే బస్సులు సైతం కుకట్ పల్లి రోడ్డు మీద నుండి వెళ్లడంతో ఒకవైపు ప్రైవేటు బస్సుల ట్రాఫిక్ మరోవైపు లులు మాల్ హడావిడితో కూకట్ పల్లి రద్ధిగా మారిపోయింది. మాల్ కు వచ్చే జనాల కేంద్రంగా కూకట్పల్లి నుండి జేఎన్టీయూ ప్రధాన రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామయ్యి భారీగా వాహనాలు నిలిచిపోయాయి. మోతాదుకు మించి జనాలు రావడంతో పోలీసులు సైతం చేతులెత్తేశారు. ఈ మాల్ దగ్గర రద్దీ కారణంగా రెండు రోజుల నుండి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.గతంలో ఐకియా ప్రారంభోత్సవంలోనూ ఇదే సీన్ కనిపించింది.. ఐకియ స్టోర్ ప్రారంభమైన మొదటి పది రోజులు విపరీతమైన రద్దీ కనిపించడం మనం చూశాం. ఇప్పుడు అక్కడ కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. 300 కోట్ల రూపాయలతో ఈ మాల్ ప్రారంభించారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…