Lalitha Jewellery Owner : లలిత జ్యువెలరీ ఓనర్ కిరణ్ కుమార్ పేరు చెప్పగానే అందరికీ ఆయన ప్రతిరూపం గుర్తొస్తుంది. నున్నటి గుండు, టీ షర్ట్, చేతికి కళ్లద్దాలతో చాలా అమాయకంగా కనిపిస్తూ అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఒకప్పుడు చాలా పేద కుటుంబంలో జీవించిన కిరణ్ కుమార్ అతి కొద్ది సమయంలోనే కోటీశ్వరుడిగా ఎదిగాడు. డబ్బులు ఎవరికీ ఊరికే రావు అంటూ ఫుల్ ఫేమస్ అయ్యాడు కిరణ్. సినిమా, స్పోర్ట్స్ స్టార్స్, మోడల్స్ చేస్తేనే కమర్షియల్ యాడ్ సక్సెస్ అవుతుందన్న నమ్మకాన్ని.. తల్లకిందులు చేసిన తెలివైన బిజినెస్మ్యాస్ లలితా జ్యువెలరీ అధినేత కిరణ్ కుమార్.
ఎక్కువ శాతం మంది ఆయన మాట తీరును చూసి తెలుగు వ్యక్తి కాదనుకుంటారు. కానీ ఆయన పక్కా తెలుగు వ్యక్తి. నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తి, అయితే తమిళనాడుకు కాస్త దగ్గరగా ఉండటం వల్ల భాష మరియు యాసలో కొంచెం సారుప్యత ఉంటుంది. కిరణ్ కుమార్ నెల్లూరులో బంగారపు వస్తువులు తయారు చేసే వర్క్ షాపులో నెల సరి జీతానికి పని చేసేవాడు. 1999లో లలితా జ్యూవెలరీని నేను టేకోవర్ చేశానని.. నేను ఒరిజినల్ ఓనర్ ని కాదు. కందు స్వామి అనే అతను ఒరిజినల్ ఓనర్. అతని వద్ద నుంచి తాను టేకొవర్ చేసినట్టు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
లలితా జ్యూవెలరీస్ అనగా జయలలిత సంబంధించినదని అందరు భావిస్తున్నారు. దానిపై క్లారిటీ ఇవ్వమని అడడగా, ఎవరు ఏమైనా అనుకోనీ.. నాకు సంబంధం లేదని పేర్కొన్నారు. సోనియా అంటే సోనియాగాంధీది అనేవారు. మోడీ జ్యూవెలరీస్ అంటే నరేంద్ర మోడీ అని అనుకునేవారు ఉన్నారు. ఏం చేస్తాం అని ఆయన బదులిచ్చారు. భారతదేశం అంతటా 450 షోరూంలు ఏర్పాటు చేయాలనే ప్లాన్ లో ఉన్నట్టుగా కిరణ్ తెలియజేశారు. ఓసారి తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లినప్పుడు తలనీలాలు సమర్పించాను. ఆ సమయంలో పక్కన ఉన్న వారు నేను గుండులో బాగున్నానని కాంప్లిమెంట్ ఇచ్చారు. దీంతో అప్పటి నుంచి గుండులోనే ఉండడానికి ఆసక్తి చూపిస్తున్నాను అని తన గుండు సీక్రెట్ కూడా చెప్పారు కిరణ్.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…