Konijeti Rosaiah : మాజీ గవర్నర్, మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య గురించి రాజకీయ విశ్లేషకులకి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. 1933 జూలై 4న గుంటూరు జిల్లా వేమూరు గ్రామంలో కొణిజేటి రోశయ్య జన్మించారు. ఆయన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున 1968, 1974, 1980లలో శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు. తొలిసారిగా మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో కేబినెట్లో పనిచేశారు. ఆ తరువాత అనేక ముఖ్యమంత్రుల మంత్రివర్గాలలో పలు కీలకమైన శాఖలు నిర్వహించారు..రోశయ్య 2009 సెప్టెంబర్ 3 నుంచి 2010 నవంబరు 24 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2011 ఆగస్టు 31న రోశయ్య తమిళనాడు రాష్ట్ర గవర్నరుగా బాధ్యతలు నిర్వహించారు. 2016 ఆగస్టు 30 వరకూ తమిళనాడు గవర్నరుగా తన సేవలు అందించారు. ఆయనకు ఆర్థిక సంబంధ విషయాలు, రాజకీయాలపై మంచి పట్టు ఉంది.
అయితే అప్పట్లో చంద్రబాబుతో పాటు ఆయన ప్రభుత్వంతో పాటు ఆయన క్యాబినేట్పై కూడా తనదైన శైలిలో పంచ్లు విసురుతూ ఒక్కరు కూడా కిక్కుమనకుండా చేసేవారు. ‘రోశయ్య 2004-09 కాలంలో ఆర్ధిక మంత్రిగా ఉన్న రోజుల్లో ఆయన అల్లుడు వైజాగ్లో ఓ క్లబ్లో పెకాడుతూ.. క్యాబరే చూస్తూ పోలీసులకు దొరికిపోయారు. దీనిమీద అసెంబ్లీలో చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు అరగంట పాటు రచ్చ రచ్చ చేశారు. ఆ తర్వాత మెల్లగా లేచిన రోశయ్య స్పీకర్తో ఇలా అన్నారు. ‘అధ్యక్షా.. ఏం చేస్తాం.. ఆ భగవంతుడు ఎన్టీ రామారావుకు నాకు మంచి అల్లుళ్లను ఇవ్వలేదు.. అని అన్నారు.. అంతే దెబ్బకు టీడీపీ సైలెంట్.. అయింది. అలానే ఓ సారి టీడీపీ సభ్యులు రోశయ్య మీద దాడి స్టార్ట్ చేశారు.. రోశయ్యకు తెలివితేటలు మరీ ఎక్కువయ్యాయంటూ వెటకారాలు మొదలెట్టారు.. దానికి ఆయన సమాధానం ఇస్తూ ఇలా అన్నాడు.
‘నాకు అన్ని తెలివితేటలే ఉంటే ఇలా ఎందుకు ఉండిపోతాను..? అంత తెలివే ఉంటే నన్ను నమ్మిన వైఎస్ను వెనుక నుంచి ఒక్క పోటు పొడిచి సీఎం కుర్చీ ఎక్కేవాడిని.. అంతకుముందు చెన్నారెడ్డిని పొడిచేవాడిని.. విజయభాస్కర్రెడ్డిని పొడిచేవాడిని..’’ అంటూ ఆనాడు రోశయ్య అసెంబ్లీ రిప్లై ఇచ్చారు. రోశయ్య వాగ్దాటికి టీడీపీ వైపు నుంచి ఒక్కరు కూడా మాట్లాడలేదు. అలా రోశయ్య కామెంట్స్ ఉంటాయి. అయితే ఓ ఇంటర్వ్యూలో రోశయ్య చంద్రబాబు గురించి పాజిటివ్గా మాట్లాడాడు. తనదైన శైలిలో తాను పోతుంటాడు. 18గంటల పాటు పని చేస్తాడు. ఇద్దరి మధ్య రాజకీయంగా వైరం ఉంది తప్ప, పర్సనల్గా ఎలాంటిది లేదు. చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్ అని చెప్పుకొచ్చాడు. రోశయ్య చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…
గుంటూరు కారంతో చివరిగా పలకరించిన మహేష్ బాబు గత కొద్ది రోజులుగా రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో పాల్గొంటూ…