Ramoji Rao : రామోజీరావుకు భారీ షాక్‌..? ఉండ‌వ‌ల్లిదే విజ‌యం..?

Ramoji Rao : రామోజీ రావు ఫిలిం సిటీ అధినేత రామోజీరావు గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఆయ‌న ఎన్నో సినిమాల‌కి కూడా నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు.మీడియాను అడ్డుపెట్టుకుని రామోజీ చేస్తున్న వ్యాపారాల్లో అనేక మోసాలు జరగుతున్నట్లు ఎప్పటినుండో ఆరోపణలున్నాయి. ఏ వ్యాపారాన్ని తీసుకున్నా చట్ట ఉల్లంఘనలు, అక్రమాలే ఉంటాయని మంత్రులు కూడా చాలాసార్లు ఆరోపించారు. ముఖ్యంగా ఉండ‌వ‌ల్లి రామోజీరావుపై అనేక ఆరోప‌ణ‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. రామోజీరావుకి చెందిన మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థ‌ మోసాలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా మొదటిసారి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) లాయర్ నోరిప్పారు.

విచారణలో ఆర్బీఐ లాయర్లు ఎన్నిసార్లు పాల్గొన్నా పెద్దగా మాట్లాడింది లేదు. అయితే తాజాగా జరిగిన విచారణలో ఆర్బీఐ లాయర్ మాట్లాడుతూ హెచ్యూఎఫ్ (హిందూ అవిభాజ్య కుటుంబం) పేరుతో డిపాజిట్లు సేకరించటం చట్ట విరుద్ధమని స్పష్టంగా చెప్పారు. ఆర్బీఐ చట్టం సెక్షన్ 45ఎస్ ప్రకారం హెచ్యూఎఫ్ పేరుతో డిపాజిట్లు సేకరించకూడదన్నారు. మార్గదర్శి ఛైర్మన్ హోదాలో రామోజీరావు, ఎండీ హోదాలో కోడలు శైలజ దశాబ్దాలుగా చట్టాన్ని ఉల్లంఘిస్తున్నట్లు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మొత్తుకుంటున్నారు. మార్గదర్శి చిట్స్ గురించి కేంద్రప్రభుత్వం అడిగితే తనకు కేంద్ర చట్టాలు వర్తించవని చెబుతారట. రాష్ట్రప్రభుత్వం అడిగితే తాను రాష్ట్రప్రభుత్వం చట్టాల ప్రకారం వ్యాపారం చేయటంలేదని చెబుతారని ఉండవల్లి సెటైర్లు వేస్తున్నారు.

Ramoji Rao facing problems undvalli got win
Ramoji Rao

ఏ చట్టమూ వర్తించకపోతే ఏ చట్టం ప్రకారం మార్గదర్శి చిట్స్ వ్యాపారం చేస్తున్నారో రామోజీయే చెప్పాలని ఉండవల్లి చాలాసార్లు డిమాండ్ చేశారు. అయితే ఎందుకు ఇలా చేశారు అంటూ పలువురు ఆందోళ‌న కూడా వ్య‌క్తం చేస్తున్నారు.ఉండవల్లి ప్రకారం మార్గదర్శి చిట్ ఫండ్స్ ద్వారా రామోజీ మోసాలు చేస్తున్నట్లు సుప్రీం కోర్టు విచారణలోనే బయటపడిందట. కాకపోతే విచారణను పూర్తిచేసి తీర్పు చెప్పటం ఒకటే మిగిలిందని మాజీ ఎంపీ పదేపదే చెబుతున్నారు. అదృశ్య శక్తి ద్వారా విచారణ పూర్తికాకుండా రామోజీ అడ్డుకుంటున్నట్లు కూడా ఉండవల్లి ఆరోపించారు. తాజాగా ఆర్బీఐ లాయర్ చెప్పిన విషయంతో మార్గదర్శి వ్యాపారమంతా మోసాలే అని అర్థ‌మవుతోందని ఉండవల్లి అన్నారు. ప్రభుత్వం లాయర్ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ చట్ట విరుద్ధంగా ప్రజల నుండి రామోజీ రూ. 4,600 కోట్లు వసూలుచేసినట్లు చెప్పారు. విచారణను ఏప్రిల్ 9వ తేదీకి వాయిదావేసింది. మరారోజు ఏమవుతుందో చూడాలి.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

5 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

1 day ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago