Konda Surekha : కొండా సురేఖ.. రాజకీయాలలో ఆమె రూటే సపరేటు. ఆమె ఒక మాస్ లీడర్. తెలంగాణ రాష్ట్రంలో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు ఉన్న లీడర్. ఆమె ఏమి మాట్లాడినా, ఎవరిపైనైనా ధిక్కార స్వరం వినిపించినా రాష్ట్రంలో సంచలనంగానే ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న ఎన్నికలలో చారిత్రక నగరమైన వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగిన కొండా సురేఖ ప్రత్యర్థి పార్టీలకు చెమటలు పట్టించింది. ప్రచారంలో దూసుకుపోయిన కొండాసురేఖ ఓటర్ల మద్దతు తనకు దక్కేలా విశ్వ ప్రయత్నాలు చేసింది. వరంగల్ నగరంలోని పెరుక వాడ బొడ్రాయి వద్ద ఉన్న భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయానికి వెళ్లారు. ఏకంగా బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలోకి వెళ్లిన కొండా సురేఖ అక్కడ ఉన్న వారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తనను గెలిపించాలని, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
వరంగల్ తూర్పు నుండి కొండా సురేఖ విజయభేరి మోగించారు. తన సమీప ప్రత్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్ కుమార్ రావుపై 15వేల మెజారిటీతో మంచి విజయం సాధించింది. పోటీ కూడా ఇవ్వని బీఆర్ఎస్ అభ్యర్ధి నన్నపనేని మూడో స్థానం నిలబెట్టుకున్నారు. అయితే విజయం తర్వాత కొండా సురేఖ అందరితో ఆప్యాయంగా పలకరించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఉన్న పలువురిని ఆప్యాయంగా పలకరించి వారితో ఫొటోలు దిగింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది.
తెలంగాణ రాష్ట్రంలోనే హాట్ సీట్ గా మారిన నియోజకవర్గం వరంగల్ తూర్పు నియోజకవర్గం. వరంగల్ తూర్పు నియోజకవర్గం లో ఎన్నికల పోరు ఆద్యంతం ఉత్కంఠను కొనసాగించింది. వరంగల్ తూర్పు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా సురేఖ, అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, బిజెపి అభ్యర్థిగా ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఎన్నికల బరిలోకి దిగి రాజకీయాలను హీటెక్కించారు. వరంగల్ జిల్లాలో చాలా ఆసక్తిగా అందరూ దృష్టి సారించిన నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే అది వరంగల్ తూర్పు నియోజకవర్గమే. ఈరోజు ఎన్నికల ఫలితాలలో కూడా వరంగల్ తూర్పు నియోజకవర్గం పై ప్రత్యేకమైన ఆసక్తిని అందరూ కనబరిచారు. పోస్టల్ బ్యాలెట్ ఫలితాల నుంచి ఈవీఎం ఓట్ల లెక్కింపులోనూ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్ని కొనసాగించింది.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…