Kalvakuntla Kavitha : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన ఫలితాలు నమోదయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్లే. కాంగ్రెస్ పార్టీ అధికారం కైవసం చేసుకుంది. ఎగ్జిట్ పోల్స్ను నమ్మం..ఎగ్జాక్ట్ పోల్స్నే నమ్ముతామన్న బీఆర్ఎస్కు ఎదురు దెబ్బ తగిలింది అని చెప్పాలి. సీఎం కేసీఆర్తో పాటు పలువురు మంత్రులు కూడా ఓడిపోవాల్సి వచ్చింది. సీఎం కేసీఆర్ గజ్వేల్తో పాటు కామారెడ్డిలో పోటీ చేయగా.. గజ్వేల్లో మాత్రమే గెలిచారు. సిరిసిల్లలో కేటీఆర్, సిద్దిపేటలో హరీష్ రావు గెలిచారు. కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి రెండు చోట్ల పోటీచేస్తే..ఒకచోట ఓడిపోయి..మరో చోట విజయం సాధించారు. కొడంగల్లో గెలిచి…కామారెడ్డిలో ఓడిపోయారు.
గెలిచిన ఆనందంలో రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు. ఆత్మగౌరవ జెండాను ఆకాశమంత ఎత్తున ఎగరేసిన కొడంగల్ గడ్డకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. కొన ఊపిరి వరకు కొడంగల్ నియోజకవర్గమే శ్వాసగా జీవిస్తాను. కష్టకాలంలో భుజాలు కాయలు కాసేలా కాంగ్రెస్ జెండాను మోసిన ప్రతి కార్యకర్తను కడుపులో పెట్టుకొని చూసుకుంటా. ఈ గడ్డపై ప్రతి బిడ్డ బతుకులో వెలుగు నింపే బాధ్యతను తీసుకుంటా. దేశానికి కొడంగల్ను ఒక మోడల్గా నిలబెడతా’’ అని అన్నారు. అయితే ఓటమి తర్వాత కేటీఆర్, కవిత, హరీష్ రావు, కేసీఆర్ చాలా నిరాశలో ఉన్నట్టు తెలుస్తుంది.
కేటీఆర్ ఎక్స్ ద్వారా స్పందిస్తూ.. ‘బీఆర్ఎస్ పార్టీకి వరుసగా రెండు పర్యాయాలు అధికారం అప్పగించిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు. ఫలితం గురించి బాధలేదు. అయితే మేము ఆశించి రీతిలో ఫలితాలు రాకపోవడంతో కచ్చితంగా నిరాశ కలిగించింది. కానీ ఈ ఫలితాన్ని ఒక పాఠంగా తీసుకొని తిరిగి పుంజుకుంటాం. ప్రజా ఆమోదం పొందిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు. శుభం జరగాలని ఆశిస్తున్నాను’’ అని స్పందించారు. ఇక ఎమ్మెల్సీ కవిత ప్రగతి భవన్ చేరుకొని కుటుంబ సభ్యుతలో కలిసి ఫలితాలను గమనించింది. ఓటమి తర్వాత వెంటనే అక్కడ నుండి చాలా బాధతో వెళ్లిపోయినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం కవితకి సంబందించిన క్లిప్స్ ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…