స‌రిత హ‌త్య విష‌యంలో అస‌లు జ‌రిగింది ఏమిటి..?

క‌రీంన‌గ‌ర్ జిల్లాలో ఓ మ‌హిళ రియ‌ల్ట‌ర్ దారుణ హ‌త్య‌కి గురి కావ‌డం క‌ల‌క‌లం రేపింది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఆమెకు భాగస్వామిగా ఉన్న వ్యక్తే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్‌లోని భగత్‌నగర్‌ క్రిస్టల్‌ ప్లాజా అపార్టుమెంట్‌లో ఈమె హ‌త్య‌కి గురి కాగా, బంధువులు వచ్చి తాళం పగులగొట్టి చూసే సరికి మృత‌దేహం కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బాధితుల ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి.

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన సరిత (38)కు మంచిర్యాల జిల్లా జన్నారానికి చెందిన శ్రీపాల్‌రెడ్డితో కొన్నాళ్ల క్రితం వివాహం జరిగింది. వీరిద్దరికి ఇద్దరు కొడుకులు అశ్విత్‌రెడ్డి (16), మణిత్‌రెడ్డి (14) ఉన్నారు. మృతురాలి భర్త శ్రీపాల్‌రెడ్డి వ్యాపారం చేస్తుండగా, కొడుకులు చదువుకుంటున్నారు. కొన్నేళ్లుగా భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో వారే విడివిడిగా ఉంటున్నారు. సరిత రాంనగర్‌లోని తల్లిదండ్రుల వద్ద ఉంటూ తన సోదరుడి షాపు వ్యవహారాలు చూసుకుంటూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కూడా చేస్తున్నది. ఈ క్ర‌మంలోనే భగత్‌నగర్‌లోని క్రిస్టల్ అపార్ట్‌మెంట్ 203 ఫ్లాట్‌లో నివాసం ఉంటున్న వెంకటేశ్ అనే వ్యక్తితో సరితకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో ఇద్దరూ వ్యాపార భాగస్వాములుగా మారారు.

karimnagar realtor saritha incident what happened

వ్యాపారం నిమిత్తం వెంకటేశ్‌కు సరిత రూ. 20 లక్షలు ఇచ్చింది. ఆ మొత్తం ఎన్నిసార్లు అడిగిన అత‌ను దాట‌వేస్తూ వ‌చ్చాడు. అయితే తాను ఓ రోజు డబ్బులు ఇస్తానని భగత్‌నగర్‌లోని తన అపార్టుమెంట్ కి పిలిపించుకున్నాడు. సరిత తాను వరంగల్‌ వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెంకటేశ్‌ వద్దకు వెళ్లింది. శుక్రవారం ఉదయం సరిత ఫోన్‌ నుంచి ఆమె సోదరి స్వాతి, సోదరుడు సతీశ్‌ నెంబర్లకు ‘మీ అక్క తల గోడకేసుకొని కొట్టుకొని, దెబ్బలతో నా ప్లాట్‌లో పడి ఉంది. వెళ్లి తాళం పగులగొట్టుకొని తీసుకెళ్లండి’ అని సందేశం వచ్చింది. వెంటనే స్వాతి తన సోదరుడితో కలిసి అక్కడికి వెళ్లి తాళం పగులగొట్టి చూడగా, సరిత తీవ్ర గాయాలతో ముక్కు, నోటి నుంచి రక్తస్ర్తావమై గొంతుకు చున్నీతో బిగించి ఊపిరాడక మృతి చెంది కనిపించింది. వెంకటేశ్‌ ఆమెను దారుణంగా హత్య చేశాడని మృతురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కాగా, గుండా శ్రీపాల్‌రెడ్డిని 2001లో ప్రేమ వివాహం చేసుకుంది.

Share
Shreyan Ch

Recent Posts

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

10 hours ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

17 hours ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

2 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

2 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

2 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

3 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

3 days ago

మ‌హేష్ బాబు లుక్ చూశారా.. అదిరిపోయాడుగా..!

గుంటూరు కారంతో చివ‌రిగా ప‌ల‌క‌రించిన మ‌హేష్ బాబు గ‌త కొద్ది రోజులుగా రాజ‌మౌళి మూవీ ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌లో పాల్గొంటూ…

3 days ago