Kane Williamson : కివీస్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ఓపెనింగ్ మ్యాచ్లో గాయపడిన విషయం మనకు తెలిసిందే. మినీ వేలంలో గుజరాత్ టైటాన్స్ జట్టు అతన్ని కొనుగోలు చేయగా, సీజన్ ఓపెనర్గా బరిలో దిగిన అతను.. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో గాయపడ్డాడు. ఆ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తలపడగా, మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై మంచి స్కోరు చేసింది. చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (92) అద్భుతంగా ఆడుతున్న నేపథ్యంలో అతను కొట్టిన ఒక భారీ సిక్సర్ను ఆపేందుకు బౌండరీ లైన్ వద్ద ఉన్న కేన్ విలియమ్సన్ గాల్లోకి ఎగిరి బంతిని క్యాచ్ చేశాడు.
అయితే బౌండరీ లైన్ ఆవల ల్యాండ్ అయ్యేప్పుడు కంట్రోల్ కోల్పోయాడు. దీంతో అతని కుడి కాలు బాగా దెబ్బతింది. నొప్పితో విలవిల్లాడిన అతన్ని గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల ఫిజియోలు పరిశీలించారు. కుడి మోకాలికి తీవ్ర గాయమైన నేపథ్యంలో ఐపీఎల్ తాజా సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. భారత్ నుంచి పయనమైన ఈ స్టార్ క్రికెటర్ న్యూజిలాండ్ చేరుకున్నాడు. అక్కడి ఎయిర్ పోర్టులో, చంకల్లో ఊతకర్రలతో, కాలుకు బ్యాండేజిలతో దర్శనమిచ్చాడు. ఊతకర్రలతో నడుస్తూనే మీడియాతో మాట్లాడుతూ ఎయిర్ పోర్టు వెలుపలికి వచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది. విలియమ్సన్ పరిస్థితి చూసి అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
కుడి కాలు కనీసం నేలపై ఆనించలేకపోతున్న అతన్ని కొందరు మీడియా ప్రతినిథులు పలకరించగా, ఇప్పుడు అంత నొప్పిగా లేదు అని సమాధానం చెప్పాడు. ఈ ఏడాది చివర్లో వన్డే వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు విలియమ్సన్కు ఇలా గాయం అవడం కివీస్కు గట్టి ఎదురు దెబ్బ అని చెప్పక తప్పదు. అభిమానులు కూడా విలియమ్సన్ను ఇలా చూడలేకపోతున్నాం అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే కేన్ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు ప్రార్ధిస్తున్నారు.
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…
గుంటూరు కారంతో చివరిగా పలకరించిన మహేష్ బాబు గత కొద్ది రోజులుగా రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో పాల్గొంటూ…