Jr NTR : ఇప్పటి స్టార్స్ అందరు ఒకవైపు సినిమాలు చేస్తూ మరోవైపు ప్రకటనలు చేస్తూ బిజీగా ఉన్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్కి ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ దక్కగా, ఆ క్రేజ్ ఉపయోగించుకొని పాపులర్ యాడ్స్ కూడా చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ చేతిలో యాపి ఫిజ్, లీసియస్, కేఎఫ్సీ.. లాంటి పలు భారీ బ్రాండ్స్ ఉన్నాయి. కొన్ని రోజుల క్రితమే ఎన్టీఆర్ కేఎఫ్సీ యాడ్ చేశారు. ఈ యాడ్ కోసం ఎన్టీఆర్ పారితోషికం కూడా కోట్లల్లోనే తీసుకున్నట్టు సమాచారం. తాజాగా ఎన్టీఆర్ బంగారు, వజ్రాభరణాలు అమ్మే మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెల్లరీ కంపెనీకి ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసిడర్ గా ఓకే చేశారు.
బ్రాండ్ ఉనికిని మరియు రీచ్ను మరింత పటిష్టం చేస్తూ కంపెనీ వినియోగదారుల ప్రచారాల్లో ఎన్టీఆర్ జూనియర్ కనిపించనున్నారు. ఈ అనుబంధానికి అనుగుణంగా, ఎన్టీఆర్ జూనియర్ నటించిన ఆకర్షణీయమైన కొత్త వాణిజ్య ప్రకటన విడుదల చేయబడింది. ఈ యాడ్ సినిమా రేంజ్లో ఉంది. ఇందులో ఎన్టీఆర్ చాలా అందంగా కనిపిస్తున్నాడు. యాడ్ కూడా చాలా రిచ్గా ఉంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. ఎన్టీఆర్ తన వ్యక్తిగత విలువలు మరియు బ్రాండ్ యొక్క నైతికత మధ్య సమలేఖనాన్ని నొక్కిచెప్పారు, సహకారాన్ని సహజంగా సరిపోయేలా చేసారు.
ఈ బ్రాండ్ నుంచి కూడా ఎన్టీఆర్ కోట్లల్లో పారితోషికం తీసుకున్నట్టు సమాహారం. ఇలా ఎన్టీఆర్ ఓ పక్క సినిమాలతోనే కాక మరోపక్క వరుస యాడ్స్ తో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా, బాలీవుడ్ లో వార్ 2 సినిమా చెయ్యనున్నాడు ఎన్టీఆర్. ఓ పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క యాడ్స్ కూడా చేస్తూ బిజీగా ఉన్నాడు. దేవర లో మెయిన్ హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తోంది. అయితే, ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ కి కూడా స్కోప్ ఉందని.. ఈ పాత్రలో మరో క్రేజీ హీరోయిన్ని తీసుకోబోతున్నారని గతంలోనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ సెకండ్ హీరోయిన్ పై మరో గాసిప్ వినిపిస్తోంది. సాయి పల్లవినే ఈ పాత్రలో తీసుకోబోతున్నట్లు టాక్. గతంలో కృతి శెట్టి పేరు కూడా వినిపించింది. మరి ఈ రూమర్ లో ఎంతవరకు నిజం ఉందో చూడాలి.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…