Jeevitha Rajasekhar : రాజశేఖర్, జీవితలకి వివాదాలు కొత్తేమి కాదు. పలు వివాదాలతో వారిద్దరు చాలా సార్లు హాట్ టాపిక్గా నిలిచారు. ఇక మెగాస్టార్ చిరంజీవి 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పటి నుంచి జీవిత-రాజశేఖర్, చిరంజీవి మధ్య గొడవలు మొదలయ్యాయి. అప్పట్లో చిరంజీవిపై వీరు చేసిన అనుచిత వ్యాఖ్యలకు అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు. కారులో వెళ్తున్న ఈ దంపతులపై మెగాస్టార్ అభిమానులు దాడి చేశారు. ఆ తరువాత వీరి నడుమ మా అసోసియేషన్ లో కూడా గొడవలు జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరి మధ్య ఎలాంటి వివాదాలు లేని సమయంలో కోర్టు సంచలన తీర్పు వెలువడటం చర్చనీయాంశంగా మారింది.
2011లో ఓ ప్రెస్ మీట్ లో జీవిత, రాజశేఖర్లు మెగాస్టార్ చిరంజీవి నిర్వహించే బ్లడ్ బ్యాంక్ ద్వారా సేకరించిన రక్తాన్ని మార్కెట్లో అమ్ముకుంటున్నారని వ్యాఖ్యలు చేశారు. నిస్వార్ధంగా చిరంజీవి సేవ చేస్తుంటే వారు అలాంటి కామెంట్స్ చేసే సరికి వారి వ్యాఖ్యలను సీరియస్ గా పరిగణించిన సినీ నిర్మాత అల్లు అరవింద్ కోర్టును ఆశ్రయించారు. చిరంజీవి పేరుతో ఎన్నో సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, ఎంతోమందికి సహాయం దొరుకుతుందని, అటువంటి చిరంజీవి పరువుకు భంగం కలిగేలా జీవిత రాజశేఖర్ వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరంజీవి పేరుతో నడుస్తున్న కార్యక్రమాలపైన, చిరంజీవి ట్రస్ట్ పైన అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ జీవిత రాజశేఖర్ లపై పరువు నష్టం దావా వేశారు.
వారు చేసిన ఆరోపణలని సీడీ రూపంలో కోర్టుకి సబ్మిట్ చేశారు. అయితే ఈ కేసు పై సుదీర్ఘ విచారణ జరిపిన కోర్టు తాజాగా తీర్పును వెల్లడించింది. జీవిత, రాజశేఖర్ ఇద్దరికీ ఏడాది జైలు శిక్షతో పాటుగా, 5000 రూపాయలు జరిమానా విధించింది. ఈ తీర్పుపై జిల్లా కోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్న నేపథ్యంలో జరిమానా చెల్లించిన వారిద్దరు నుంచి పూచీకత్తులను సమర్పించి బెయిల్ తీసుకుని విడుదలయ్యారు. మరి వారికి జిల్లా కోర్టులో అయిన అనుకూలంగా ఉంటుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…