ప్రముఖ తమిళ సీరియల్ నటి జయలక్ష్మీ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. మహాలక్ష్మి 2000లో సన్ మ్యూజిక్ ఛానెల్లో వ్యాఖ్యాతగా తన కెరీర్ను ప్రారంభించింది. ఆ తర్వాత మరింత మంది అభిమానులను సంపాదించుకుంది. ఇటీవల నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్ ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి పెళ్లి వేడుక ఇటీవల తిరుపతిలో ఘనంగా జరగగా, ఇది ఇద్దరికి రెండవ వివాహమే. అయితే మహాలక్ష్మి, రవీందర్ వివాహం జరిగిన తర్వాత వీరిద్దరిపై ఎంతగా ట్రోల్ నడిచిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారీ కాయుడు అయిన రవీందర్ని ఆమె కేవలం డబ్బు కోసమే చేసుకుందని దారుణంగా ట్రోల్ చేశారు. అయినప్పటికీ ఆ వార్తలకి ధీటుగా స్పందించారు.
జయలక్ష్మీ గత 3 సంవత్సరాలలో ఆమె చెల్మే, ముంతనై ముడిచి, ఇరు మలర్, ఆవా వంటి అనేక సీరియల్స్లో నటించింది. కెరీర్ మధ్యలో అనిల్ నేరేడిమిల్లిని వివాహం చేసుకుంది. మహాలక్ష్మికి మొదటి వివాహంలో ఒక బిడ్డ కూడా పుట్టాడు. అయితే తన భర్త నటుడు ఈశ్వర్, మహాలక్ష్మి మధ్య ఎఫైర్ ఉందని నటి జయశ్రీ సంచలన వ్యాఖ్యలు చేసింది. తన భర్తతో మహాలక్ష్మీకి ఎఫైర్ ఉందని అందుకనే ఆమె మొదటి భర్త వదిలేశాడని జయశ్రీ సంచలన ఆరోపణలు చేసింది. నా ముందే నా భర్తతో ఆమె వీడియో కాల్స్ మాట్లాడేది. మహాలక్ష్మి కొడుకు నా భర్తని నాన్న అని పిలిచేవాడు అంటూ జయశ్రీ సంచలన ఆరోపణలు చేసింది.
అయితే జయశ్రీ వ్యాఖ్యలపై స్పందించిన మహాలక్ష్మీ వ్యక్తిగత జీవతంపై బురద జల్లేందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారంటూ వాపోయింది. తాను కష్టాల్లో ఉన్న సమయంలో రవీందర్ అండగా నిలిచారు. ఆయన వ్యక్తిత్వం నాకు నచ్చింది కాబట్టే అతనిని వివాహం చేసుకున్నా అని మహాలక్ష్మి పేర్కొంది. తాను నెలకు 3 లక్షలు సంపాదిస్తున్నానని, డబ్బు సంపాదించేందుకు ఇంకా చాలా మార్గాలు అవలంబించవచ్చని మహాలక్ష్మి తెలిపింది. నెటిజన్లు ఎంత ట్రోల్ చేసినప్పటికీ, మహాలక్ష్మి తన భర్త రవీందర్ చంద్రశేఖర్తో దిగిన చిత్రాలను పంచుకోవడం ద్వారా తన ప్రేమను వ్యక్త పరుస్తూనే ఉంది.
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…