Jabardasth Sowmya Rao : అనసూయ స్థానంలో జబర్దస్త్ షోకు కొత్త యాంకర్ వస్తుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉండగా ఎట్టకేలకు సౌమ్య రావు అనే కొత్త యాంకర్ తెరమీదకు వచ్చింది. కొత్త యాంకర్పై వచ్చి రాగానే హైపర్ ఆది పంచులు విసిరాడు. కృష్ణ భగవాన్ కూడా ఆమెపై పంచులేయడం.. దానికి ఆమె రివర్స్ కౌంటర్లు ఇవ్వడంతో ఆ వీడియో వైరల్ గా మారింది. సౌమ్య రావు.. బెంగళూరులో చదువు పూర్తి కాగానే ఓ కన్నడ న్యూస్ ఛానల్లో యాంకర్గా పనిచేసింది. ఆ తర్వాత మోడల్గానూ రాణించింది. నటనపై ఆసక్తితో అవకాశాల కోసం ప్రయత్నించి.. పట్టేదారి ప్రతిభ అనే కన్నడ సీరియల్తో బుల్లితెరకు పరిచయమైంది.
ఆ సీరియల్ హిట్ కావడం.. తన నటనకు మంచి గుర్తింపు లభించడంతో తమిళ టీవీ సీరియల్స్లోనూ అవకాశాలు వచ్చాయి. తెలుగులోనూ ఈటీవీలో ప్రసారమయ్యే శ్రీమంతుడు సీరియల్లో నటిస్తూ తెలుగు వారికి బాగా దగ్గరైంది. అందం, అభినయంతో సీరియల్స్లో అదరగొడుతున్న ఈ నటి.. యాంకర్గానూ మెప్పిస్తోంది. వచ్చినప్పట్నుంచి స్పెషల్ ఎట్రాక్షన్గా నిలుస్తుంది. ఇప్పటికే 2 ఎపిసోడ్స్ లో సందడి చేసింది సౌమ్య రావు. ఇప్పుడు మూడో ఎపిసోడ్కి రెడీ అవుతుంది. ఈ నేపథ్యంలో ఆమెకి సంబంధించిన ఓ వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
![Jabardasth Sowmya Rao : జబర్దస్త్ కొత్త యాంకర్కు నా.. అన్నవాళ్లు ఎవరూ లేరా..? కంట తడి పెట్టిస్తున్న జీవితం.. Jabardasth Sowmya Rao cries while telling about her story](http://3.0.182.119/wp-content/uploads/2022/11/jabardasth-sowmya-rao.jpg)
ఇందులో ఆమె తెర వెనుక జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను బయటపెట్టింది. తాను అనాథని అని చెప్పడం షాక్ కి గురి చేస్తుంది. షోలో మీ గురించి ఏదైనా చెప్పండి అని యాంకర్ ప్రదీప్ అడగ్గా తాను తన లైఫ్ గురించి చెప్పనని పేర్కొంది. కానీ తనొక అనాథని పేర్కొంది. నా లైఫ్ గురించి చెప్పను నాకు అమ్మలేదు. నాన్న ఉండి కూడా లేడు. ప్రస్తుతం నేను ఓ అనాథని, నాకు ఎవరూ లేరు. ఇక్కడున్న వారందరికీ అమ్మనో, నాన్ననో, బ్రదరో, సిస్టరో ఎవరో ఒక్కరైనా ఉంటారు. కానీ నాకు ఎవరూ లేరు. ఇలాంటి ఫ్యామిలీ దొరికినప్పుడు చాలా బాగా చూసుకుంటాను అని పేర్కొంటూ కన్నీళ్లు పెట్టుకొని, అందరి చేత కన్నీళ్లు పెట్టిస్తుంది సౌమ్య రావు.