జ‌గ‌న్‌ని పొడిచింది క‌త్తి శీను కాదు.. బొత్స‌ మేన‌ల్లుడు..!

సీఎం జగన్ పై దాడి కేసులో కోడికత్తి శ్రీను పై విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. కేసులో విచారణ పూర్తైందని ఎన్ఐఏ చెబుతున్నా కేసు విచారణ జాప్యం అవటానికి కారణాలు ఇవేనంటూ శ్రీను లాయర్ సలీం చెబుతున్న విషయాలు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాయి.నిందితుడు శ్రీనివాసరావు తరపు న్యాయవాది సలీం సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీనివాస్ కు కోడికత్తిని అందించింది మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు అని సలీం ఆరోపించారు. దినేశ్ కుమార్ కు మజ్జి శ్రీనివాసరావు కోడికత్తిని ఇచ్చాడని, అయితే ఆ నేరాన్ని శ్రీనుపై మోపారని చెప్పారు. కావాలనే ఎన్ఐఏ కోర్టు విచారణకు జగన్ హాజరు కావడం లేదని… విచారణకు జగన్ హాజరైతే అన్ని వివరాలు బయటపడుతాయని అన్నారు.

కోడికత్తి దాడిలో ఎలాంటి కుట్ర లేదని ఎన్ఐఏ గతంలోనే చెప్పిందని సలీం తెలిపారు. రాజకీయాల కోసమే ఈ కేసును సాగదీస్తున్నారని చెప్పారు. మరోవైపు జగన్ కోర్టుకు వచ్చి, ఎన్ఓసీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విశాఖలో నిన్న నిరసన కార్యక్రమం చేపట్టాలని దళిత సంఘాల ఐక్య వేదిక నిర్ణయించింది. అయితే నిరసన కార్యక్రమం ప్రారంభం కాకముందే దళిత సంఘాల నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.జగన్‌పై సెక్షన్‌ 189 ప్రకారం కేసు పెట్టే అవకాశం ఉన్నా పోలీసులు పట్టించుకోలేదు. జగన్‌ హైదరాబాద్‌లో దిగగానే అంబులెన్స్‌ వచ్చి ఆస్పత్రికి తీసుకువెళ్లింది. ఇవన్నీ పథకంలో భాగంగానే జరిగాయి’’ అని సలీమ్‌ పేర్కొన్నారు. కోర్టుకు వచ్చి సాక్ష్యం చెబుతానన్న జగన్‌ ఇప్పుడు ఎందుకు రావడం లేదని ఆయన ప్రశ్నించారు. ఆయనకు చట్టంపై విశ్వాసం లేదని, అందుకే ‘రావాలి జగన్‌.. చెప్పాలి సాక్ష్యం’ అని డిమాండ్‌ చేస్తున్నానని తెలిపారు.

interesting details on kathi seenu

నిందితుడి తరఫున కోర్టులో వాదనలు వినిపించిన సలీమ్‌.. బుధవారం కూడా ఇక్కడే ఉన్నారు. తనను కలిసిన మీడియాతో ఆయన కేసు వివరాలు పంచుకున్నారు. ‘‘కోడికత్తి ఘటన జరిగిన విశాఖ విమానాశ్రయంలో అసలేం జరిగిందనేది పూర్తి చరిత్ర, దానికి సంబంధించిన ఆధారాలు నా వద్ద ఉన్నాయి. కోడికత్తి దాడి పథకం విజయవంతమైతే సానుభూతి వెల్లువెత్తి జగన్‌ సీఎం అవుతారని వారు ముందుగానే ఊహించారు. ఆ తర్వాత అదే నిజమైంది. ఇప్పుడు జగన్‌ సీఎం సీట్లో ఉన్నారు. అసలు జగన్‌పై ఏ ఆయుధంతో దాడి జరిగిందనే విషయం ఆ రోజు మధ్యాహ్నం రెండు గంటల వరకు బయటపడలేదు అని ఆయ‌న చెప్పారు.

Share
Shreyan Ch

Recent Posts

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

21 mins ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

20 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 days ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago