టీ20 ప్రపంచకప్ 2022లో టీమిండియా వరుస విజయాలకి సౌతాఫ్రికా బ్రేక్ వేసింది. ఆదివారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా రాణించిన సఫారీ టీమ్.. 5 వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో డేవిడ్ మిల్లర్ అజేయ హాఫ్ సెంచరీతో సఫారీలను గెలిపించాడు.ఈ మ్యాచ్లో భారత్ గెలవాలని పాక్ అభిమానులు ఎన్నో ప్రార్ధనలు చేశారు. కాని వారి ఆశలు అడియాశలు అయ్యాయి. ఈ విజయం సౌతాఫ్రికా సెమీస్ అవకాశాలను మెరుగుపరచగా.. పాకిస్థాన్ను టోర్నీ నుంచి నిష్క్రమించేలా చేసిందనే చెప్పాలి.
దక్షిణాఫ్రికాపై భారత జట్టు ఓటమి తర్వాత గ్రూప్ 2 పాయింట్ల పట్టికలో భారీ మార్పు చోటు చేసుకుంది. ఇప్పుడు దక్షిణాఫ్రికా జట్టు మూడు మ్యాచ్లలో రెండు విజయాలు, ఒక మ్యాచ్ వాష్ అవుట్ కావడంతో పాయింట్ల పట్టికలో నంబర్ వన్కు చేరుకుంది. ఇక భారత్ గురించి చెప్పాలంటే రెండు విజయాలు, ఒక ఓటమితో రెండో స్థానానికి పడిపోయింది. దక్షిణాఫ్రికాకు ఐదు పాయింట్లు, భారత్కు నాలుగు పాయింట్లు ఉన్నాయి. గ్రూప్-2లో బంగ్లాదేశ్ మూడో స్థానంలో ఉంది. జింబాబ్వే జట్టు నాలుగో స్థానంలో ఉంది. పాక్ జట్టు రెండు పాయింట్లతో ఐదో స్థానంలో, నెదర్లాండ్స్ ఆరో స్థానంలో కొనసాగుతున్నాయి.
భారత్ ఓటమి తర్వాత ప్రస్తుతం పాక్ జట్టుకు ఇబ్బందులు తలెత్తాయి. దక్షిణాఫ్రికా తమ తదుపరి మ్యాచ్లో పాకిస్థాన్ను ఓడించినట్లయితే, బాబర్ సేన ప్రపంచకప్ నుంచి నిష్క్రమిస్తుంది. దక్షిణాఫ్రికాను పాకిస్థాన్ ఓడించినా.. నెదర్లాండ్స్తోనూ దక్షిణాఫ్రికా ఆడాల్సి ఉన్నందున అది కష్టమేమీ కాదు కాబట్టి చివరి మ్యాచ్లో ఆఫ్రికా జట్టు గెలిస్తే 7 పాయింట్లు దక్కుతాయి. మరోవైపు దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్లను ఓడించడం ద్వారా పాకిస్థాన్ ఆరు పాయింట్లను మాత్రమే చేరుకుంటుంది. దీంతో పాక్ దాదాపు నిష్క్రమించినట్టే అని చెప్పాలి. టాప్ 2లో సౌతాఫ్రికా, ఇండియా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఇండియా తన తదుపరి మ్యాచ్ లలో బంగ్లాదేశ్, జింబాబ్వేతో పోరాడనుంది. ఇవి రెండు గెలిస్తే టాప్కి వెళుతుంది.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…