IND Vs WI 2023 : ఈ ఏడాది అక్టోబర్లో వరల్డ్ కప్ మొదలు కానున్న విషయం తెలిసిందే . అయితే వరల్డ్ కప్ ముందు సుదీర్ఘ విరామం తర్వాత విండీస్ జట్టు భారత్తో టెస్ట్, వన్డే, టీ20 మ్యాచ్లు ఆడనుంది. వారం రోజుల ముందే కరేబియన్ దీవులకు చేరుకున్న టీమిండియా అక్కడ మూడు ఫార్మాట్లలో తలపడనుంది. వెస్టిండీస్తో భారత్ 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20ల సిరీస్ ఆడనుంది. జులై 12 నుంచి సిరీస్ ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్లు ఎందులో చూడాలని చాలా మందిలో ఓ సస్పెన్స్ ఉంది. అయితే ఇండియా వెస్టిండీస్ సిరీస్ మ్యాచ్లను స్టార్ స్పోర్ట్స్, సోనీ నెట్వర్క్లలో ప్రత్యక్ష ప్రసారం చేయడం లేదు. బదులుగా, టీవీలో చూడాలనుకుంటే DD స్పోర్ట్స్లో మాత్రమే చూడవచ్చు. జియో స్పోర్ట్స్లో కూడా ప్రత్యక్షంగా చూడవచ్చు.
భారత కరేబియన్ టూర్లోని టెస్ట్, వన్డే, టీ20 మ్యాచ్లు దూరదర్శన్ నెట్వర్క్ DD స్పోర్ట్స్లో మాత్రమే ప్రత్యక్ష ప్రసారం కానుంది. అంతే కాకుండా, ఆన్లైన్ వీక్షకులు జియో సినిమా, ఫ్యాన్కోడ్ యాప్ ద్వారా చూడవచ్చు. నెల రోజుల ఈ పర్యటనలో భారత్.. వెస్టిండీస్తో మొత్తం 10 మ్యాచ్లు ఆడుతుంది. టెస్టు సిరీస్తో భారత్ పర్యటన ప్రారంభం అవుతుంది. డొమినికాలోని విండ్సర్ పార్క్ స్పోర్ట్స్ స్టేడియంలో జూలై 12 నుంచి జూలై 16 వరకు తొలి టెస్టు జరుగనుంది. ఇక రెండో టెస్టు మ్యాచ్.. జూన్ 20 నుంచి జూన్ 24 వరకు ట్రినిడార్లోని క్వీన్స్ పార్క్ ఓవల్లో జరుగనుంది. రెండు టెస్టు మ్యాచ్లు భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభం అవుతాయి.
టెస్ట్ సిరీస్ ముగిసిన తర్వాత రెండు రోజుల విరామం అనంతరం మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ప్రారంభం అవుతుంది. ఇవి రాబోవు వన్డే వరల్డ్ కప్కి సన్నాహాక మ్యాచ్లుగా ఉపయోగపడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. బార్బడోస్లోని కెన్సింగ్టన్ ఓవల్లో జూలై 27న తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. రెండో వన్డే జూలై 29న జరుగనుంది. తొలి వన్డే జరిగిన మైదానంలో రెండో వన్డే జరుగుతుంది. వన్డే సిరీస్లో చివరిదైన మూడో వన్డే ఆగస్టు 1న ట్రినిడార్లోని బ్రియాన్ లారా క్రికెట్ అకాడమీలో జరుగుతుంది. వన్డేలు సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానుండగా, ఐదు టీ20 మ్యాచ్లు రాత్రి 8 గంటలకు ప్రారంభం కానున్నాయి.
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…
గుంటూరు కారంతో చివరిగా పలకరించిన మహేష్ బాబు గత కొద్ది రోజులుగా రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో పాల్గొంటూ…