IND Vs BAN : భారత్- బంగ్లదేశ్ రెండో టెస్ట్ ఎంతో రవసత్తరంగా సాగగా చివరికి భారత్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో బంగ్లాదేశ్ సీరిస్ ను క్లీన్ స్వీప్ చేసింది. రెండో టెస్టు దాదాపు టీంఇండియా చేయ్యి జారిపోతున్న సమయంలో టెయిలెండర్స్ దూకుడుగా ఆడటంతో మ్యాచ్ ఇండియా వైపు టర్న్ అయ్యింది. ఉత్కంఠ పోరులో బంగ్లా దేశ్ పై భారత్ 3 వికెట్ల తేడాతో విజయం సాదించడం ద్వారా.. సీరిస్ ను 2-0 తేడాతో భారత్ కైవసం చేసుకుంది.
బంగ్లాదేశ్ నిర్దేశించిన టార్గెట్.. 145 రన్స్ ను చేధించడానికి టీంఇండియా బ్యాట్స్ మెన్స్ చాలా తీవ్రంగా శ్రమించారు. స్వల్ప వ్యవధిలో వికెట్లు కోల్పోతూ.. 4 వికెట్లు నష్టానికి 45 ఓవర్ నైట్ స్కోరుతో నాలుగురోజు ఆట ప్రారంబించిన భారత్.. ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో అయ్యర్ ( 29) , అశ్విన్ ( 42) నిలకడగా ఆడుతూ 71 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నమోదు చేసి.. మ్యాచ్ ను పూర్తిగా టర్న్ చేశారు. దీంతో బంగ్లాపై ఇండియా విజయం సాధించింది. అశ్విన్కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కగా, పుజారాకి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అందించారు.
అంతకుముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్లో 314 పరుగులకు ఆలౌట్ అయింది. పంత్ 93, శ్రేయాస్ అయ్యర్ 87 పరుగులతో రాణించారు. కెప్టెన్ రాహుల్(10), శుభమన్ గిల్ (20), పుజారా (24) కోహ్లీ (24) దారుణంగా విఫలమయ్యారు. బంగ్లాదేశ్ తన తొలి ఇన్నింగ్స్లో 227 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్కు 87 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఇక బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్లో 231 పరుగులు చేసి ఆలౌటైంది. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ (3/68), సిరాజ్ (2/41), అశ్విన్ (2/66) రాణించారు. బంగ్లా విషయానికి వస్తే.. లిటన్ దాస్ (73; 98 బంతుల్లో 7×4) జాకిర్ హసన్ (51; 135 బంతుల్లో 5×4), నురుల్ (31), తస్కిన్ అహ్మద్ (31 నాటౌట్)ల పోరాటం చేయడం వల్లనే బంగ్లా ఆ మాత్రం స్కోర్ సాధించగలిగింది. ఇక బంగ్లాదేశ్ బౌలర్లలో మెహిదీ హసన్ మిరాజ్ 5 వికెట్లు తీశాడు. షకీబ్ అల్ హసన్ రెండు వికెట్లు వికెట్ తీశాడు.
అయితే ఎలాగోలా మ్యాచ్ గెలిచినప్పటికీ టీమిండియాపై విమర్శలు తప్పడం లేదు. ఈ మ్యాచ్లో కుల్దీప్ యాదవ్ను పక్కన పెట్టడం పెద్ద మిస్టేక్ కాగా.. ద్రావిడ్ కోచింగ్ అసలు ఏమీ బాగా లేదని.. కేఎల్ రాహుల్ ఇండియా పరువును దిగజార్చాడని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ద్రావిడ్ వెంటనే కోచ్గా తప్పుకోవాలని.. కేఎల్ రాహుల్ కు ఇకపై ఎప్పుడూ కెప్టెన్సీ ఇవ్వొద్దని అంటున్నారు. మరి బీసీసీఐ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…