ఇటీవల కాలంలో మనిషి ప్రాణం ఎప్పుడు ఎలా పోతుందో అర్థం కాని విధంగా మారిపోయింది. ఎందుకంటే ఇప్పటికే ఎన్నో రకాల వైరస్లు మనుషుల ప్రాణాలు తీసేందుకు ముంచుకొస్తున్న తరుణంలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. మొన్నటి వరకు కరోనా వైరస్ తో ప్రతిరోజు దినదిన గండం గానే బ్రతికాడు మనిషి. ఇక ఇప్పుడు కరోనా వైరస్ ప్రభావం తగ్గింది అని అందరూ ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో.. సడన్ హార్ట్ ఎటాక్ల కారణంగా మనిషి ప్రాణం ఏ క్షణంలో పోతుందో కూడా ఊహించలేని విధంగా మారిపోయింది. ఇక ఇవన్నీ చాలవు అన్నట్లు మరికొన్నిసార్లు అనూహ్యమైన ఘటనలు కూడా ప్రాణాలు తీసేస్తూ ఉన్నాయి.
ప్రతిరోజూ మనం చేసే పనుల కారణంగానే చివరికి ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. వర్షాకాలం వలన ప్రతి ఒక్కరు స్నానానికి ముందు నీటిని వేడి చేసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా హీటర్ వాడుతున్నారు. ఆ హీటర్ కారణంగా ప్రాణాలు పోతాయి అంటే ఎవరైనా నమ్ముతారా. కానీ ఇక్కడ మాత్రం ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా హీటర్ ఆన్ చేస్తుండగా కరెంట్ షాక్ కొట్టి ఒక మృతి చెందింది. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం వాసి హనుమంత రెడ్డి ఇంట్లో విషాదం నెలకొంది. తల్లిదండ్రుల కలలు, ఆశలపై నీళ్లు జల్లి కానరాని లోకాలకు తరలి వెళ్లిపోయింది.
హనుమంత రెడ్డి, పుష్పలత దంపతులకు ఒక్కగానొక్క కుమార్తె నిఖితా రెడ్డి(15). ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతోంది. ఉదయం స్నానం చేసేందుకు బాత్రూములోకి వెళ్లింది. కుళాయిని తిప్పుతుండగా.. కరెంట్ షాక్ కొట్టి అక్కడిక్కడే మృతి చెందింది. ఆమె అరుపులకు విన్న తల్లిదండ్రులు ఆమెను బాత్రూమ్ నుండి బయటకు తీసుకు వచ్చే సరికి విగతజీవిగా కనిపించింది. ఆసుపత్రికి తీసుకెళ్లగా చనిపోయినట్లు నిర్ధారించారు. షార్ట్ సర్య్కూట్ కారణంగా కుళాయికి విద్యుత్ సరఫరా జరిగి.. షాక్ తగిలి చనిపోయి ఉంటుందని భావిస్తున్నారు. పోలీసులకు సమాచారం అందించగా.. సీఐ అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపడుతున్నారు. ఒక్కాగానొక్క కుమార్తె చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు బాధ వర్ణనాతీతం.
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…
గుంటూరు కారంతో చివరిగా పలకరించిన మహేష్ బాబు గత కొద్ది రోజులుగా రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో పాల్గొంటూ…