Samantha : చెన్నైలో పుట్టి పెరిగిన సమంత ఏ మాయి చేశావె సినిమా ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి టాప్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. తొలి సినిమాతోనే ఫిల్మ్ ఫేర్ అవార్డు సొంతం చేసుకుంది. సమంత మొదట తన కెరీర్ ని మోడలింగ్ తో ప్రారంభించింది. చెన్నైలోని స్టెల్లా మేరీ కాలేజీ నుండి డిగ్రీ పట్టా అందుకుంది. ఆమె కెరీర్ నుంచి అక్కినేని కోడలి వరకు ఆమె ప్రస్థానం గురించి తెలుసుకుందాం. సమంత చిన్నతనంలో ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండటంతో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ మొదట మోడలింగ్ ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.
ప్రత్యూష ఫౌండేషన్ స్థాపించి పేద పిల్లలకు, అనారోగ్యంతో ఉన్న మహిళలకు ఆరోగ్య సేవలు అందిస్తుంది. సమంత తండ్రి తెలుగు. తల్లి మళయాళీ అయినా సమంత చెన్నైలో పుట్టి పెరిగినందు వల్ల తమిళియన్ అని చెప్పుకుంటుంది. మొదట్లో తెలుగు కష్టంగా ఉన్నా ఇప్పుడు గలగలా మాట్లేస్తుంది. మనందరికీ ఈమె సమంతగా తెలుసు. ఫ్రెండ్స్ సామ్ అని పిలుస్తారు. అలాగే సమంతకి యశోద అనే ఇంకొక పేరు కూడా ఉంది. ఆమె మొదట రవి వర్మన్ దర్శకత్వంలో మాస్కో ఇన్ కావేరి అనే సినిమాలో నటించింది. కానీ మొదట విన్నత్తాండి వరువాయ విడుదల అయింది.
సమంతకి హాలీవుడ్ హీరో ఆడ్రీ హెప్బర్న్ ప్రేరణ అని చెబుతుంది. సినిమా, వ్యక్తిగత జీవితం మీద ప్రభావం చూపాడని చెబుతూ ఉంటుంది. ఆమె చదువుకొనే రోజుల్లో కాలేజ్ టాపర్ గా ఉండేది. దాని కోసం చాలా కష్టపడేది. అలాగే సినిమాల్లో కూడా బాగా కష్టపడి ఉన్నత స్థానానికి ఎదిగింది. ఆమెకు పచ్చి మాంసం, కూరగాయలు కలిపి ఉడికించి చేసే జపనీస్ వంటకం సూషీ, డెయిరీ మిల్క్ చాక్లెట్ అంటే చాలా ఇష్టం. పాలకోవా ఆమెకి ఇష్టమైన స్వీట్.
రోడా బ్రైన్ రచించిన ద సీక్రెట్ అనే పుస్తకం చాలా ఇష్టమైన పుస్తకం. ఈ పుస్తకాన్ని లా ఆఫ్ ఫాసినేషన్ మీద రాశారు. సమంత 2013 లో మధుమేహం బారిన పడింది. అయితే ఈ సమస్య నుండి కొన్ని నెలల్లోనే బయట పడింది.సమంత, నాగ చైతన్య ఏ మాయ చేసావే సినిమా టైంలో ప్రేమలో పడి పెద్దలను ఒప్పించి 2017 సంవత్సరం అక్టోబర్ లో పెళ్లి చేసుకున్నారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…