Dil Raju : తెలుగు సినిమాలకి దాదాపు పది నేషనల్ అవార్డులు రావడంపై ఇండస్ట్రీకి సంబంధించిన పలువురు ప్రముఖులు సంతోషం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాజాగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు నేషనల్ అవార్డ్స్ దక్కించుకున్న వారందరికి శుభాకాంక్షలు తెలియజేశారు. నేషనల్ ఫిల్మ్ అవార్డుల్లో తెలుగు సినిమాలు సత్తా చాటడంపై ప్రొడ్యూసర్ దిల్ రాజు సంతోషం వ్యక్తం చేశారు. RRR, పుష్ప టీమ్ లకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతూ వీడియో విడుదల చేశారు. 69వ జాతీయ అవార్డ్స్ విజేతలందరికీ అభినందనలు. జాతీయ ఉత్తమ నటుడు అవార్డ్ పొందిన అల్లు అర్జున్ గారికి అభినందనలు.
ఫస్ట్ టైమ్ ఒక తెలుగు హీరోకి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు రావడం అల్లు అర్జున్ గారికి తెలుగు చిత్ర పరిశ్రమకు గ్రేట్ మూమెంట్. జాతీయ అవార్డులు పొందిన ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ అందరికీ పేరుపేరునా అభినందనలు. రాజమౌళి గారు ప్రతి సినిమాతో తెలుగు సినిమాని మరోస్థాయికి తీసుకెళుతున్నారు. అందుకు రాజమౌళి గారికి ప్రత్యేక అభినందనలు. దేవీశ్రీ ప్రసాద్ గారికి స్పెషల్ కంగ్రాజులేషన్స్. దేవిశ్రీ తో మాది గ్రేట్ జర్నీ. ఎన్నో విజయవంతమైన చిత్రాలు చేశాం. పుష్ప సినిమాకి దేవిశ్రీ కి నేషనల్ అవార్డ్ రావడం చాలా అనందంగా వుంది. ఉప్పెన చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, దర్శకుడు బుచ్చిబాబు, టీం అందరికీ అభినందనలు.
మొదటి సినిమాతోనే బుచ్చిబాబుకు, అలాగే ఫస్ట్ టైం మైత్రీ మూవీ మేకర్స్ కి నేషనల్ అవార్డ్ రావడం చాలా అనందంగా వుంది. కొండపొలం సినిమాలోని పాటకు అవార్డ్ పొందిన చంద్రబోస్ గారికి అభినందనలు. మొన్ననే ఆస్కార్ అవార్డ్ తీసుకొచ్చారు. ఇప్పుడు నేషనల్ అవార్డ్ తీసుకోబోతున్నారు. తెలుగు సినిమాకి ఇన్ని అవార్డులు రావడం, ఇవాళ ఇండియన్ సినిమాలో తెలుగు సినిమాకి ప్రత్యేక గుర్తింపు వచ్చేలా చేసిన మీ అందరికీ ధన్యవాదాలు, అభినందనలు అని అన్నారు. దిల్ రాజు మాటలు చూస్తే ఆర్ఆర్ఆర్ సినిమాతో చరణ్ అవార్డ్ దక్కించుకోకపోయిన గేమ్ చేంజర్ సినిమాతో తప్పక అందుకుంటాడని అనుకుంటున్నారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…