Dhoomam On OTT : ఇప్పుడు టాలీవుడ్ స్థాయి పెరిగింది. తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేని మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్. అల్లు అర్జున్ ‘పుష్ప: ది రూల్’లో విలన్ భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో ఆయన తన నటనతో మెప్పించారు. పుష్ప’ కంటే ముందు మలయాళ ఇండస్ట్రీ లో స్టార్ హీరోగా ఉన్న ఫాహద్.. పుష్ప తో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం వరుసగా మలయాళ సినిమాలు చేస్తూనే ఇతర భాషల్లోనూ నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే గత ఏడాది ఈ హీరో నటించిన ‘ధూమం’ ఎట్టకేలకు ఓటీటీలోకి రాబోతుంది. కేజీఎఫ్, సలార్ వంటి సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన హొంబాలే ఫిల్మ్స్ సంస్థ ఈ సినిమాను రూపొందించింది. గతేడాది జూన్ లో రిలీజైన ధూమం మూవీ యావరేజ్ గా నిలిచింది. అంచనాలు అందుకోలేక మోస్తరు వసూళ్లతో సరిపెట్టుకుంది. దీంతో ధూమం మూవీ కేవలం మలయాళం వరకే పరిమితమైంది. తెలుగులో రిలీజ్ చేయలేకపోయారు మేకర్స్.
అయితే, ఇప్పుడు సుమారు ఏడాది తర్వాత ధూమం సినిమా తెలుగులో ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. ఈ మేరకు స్ట్రీమింగ్ డేట్ కూడా ఫిక్స్ అయింది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ధూమం సినిమా రానుంది. జులై 11న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు ఆహా సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది. ‘ఎంతో గ్రిప్పింగ్గా ఉండే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మిమ్మల్ని ఊహించని రైడ్లోకి తీసుకెళుతుంది. జూలై 11న ధూమం మూవీ ఆహాలో ప్రీమియర్ కానుంది’ అని ఆహా పోస్ట్ చేసింది. అలాగే సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్ కూడా రిలీజ్ చేసింది.
ఈ సినిమా ఇప్పటికే ఓటీటీ వేదిక యాపిల్లో స్ట్రీమింగ్ అవుతుండగా, ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. థియేటర్ లో రిలీజైన ఏడాది తర్వాత ఇప్పుడు తెలుగు ఓటీటీ ఆహా లో జులై 11వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ‘ఆహా’ పోస్టర్ పంచుకుంది. దీంతో ఫ్యాన్స్ తెగ సంతృప్తి చెందుతున్నారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…