Shyamala Devi : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంతో మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. బ్రేకుల్లేని బండిలా బాక్సాఫీస్ను దున్నేస్తుంది కల్కి చిత్రం. దీంతో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కల్కి హవానే కనిపిస్తుంది. అయితే కల్కితో పాటు జ్యోతిష్యుడు వేణుస్వామి కూడా ట్రెండ్ అవుతున్నారు. ప్రభాస్ పని బాహుబలితోనే అయిపోయిందని.. ఆయన తన కెరీర్లో చూడాల్సిన పీక్స్ చూసేశారని వేణుస్వామి అన్నారు. అలానే ఇక ప్రభాస్తో సినిమాలు చేసే నిర్మాతలు ఆలోచించాల్సిందే అంటూ వేణుస్వామి ఉచిత సలహాలు కూడా ఇచ్చారు. అయితే కట్ చేస్త్ మొన్న సలార్, ఇప్పుడు కల్కితో ప్రభాస్ వరుసగా బ్లాక్ బస్టర్లు కొట్టారు. దీంతో వేణుస్వామిని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు ప్రభాస్ అభిమానులు. తాజాగా ప్రభాస్ పెద్దమ్మ, కృష్ణం రాజు భార్య శ్యామలా దేవి కూడా వేణుస్వామికి ఇండైరెక్ట్ కౌంటర్ ఇచ్చారు.
రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి గురించి అతని అభిమానులు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్నారు. గతేడాది అతని పెళ్లవడం ఖాయం అన్నట్లుగా వార్తలు వచ్చాయి. కొందరైతే ప్రభాస్ కు ఇక పెళ్లి జరగదని కూడా అన్నారు. బాహుబలి తర్వాత అతడు మళ్లీ సక్సెస్ చూడడని కూడా చెప్పారు. కానీ సలార్, కల్కి 2898 ఏడీతో అది తప్పని నిరూపించాడు. అలాగే ప్రభాస్ పెళ్లి కూడా జరుగుతుందని శ్యామలా దేవి చెప్పారు. ఈ మధ్య ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె కల్కి సక్సెస్, ప్రభాస్ పెళ్లి గురించి మాట్లాడారు. “ఓ మనిషి మంచితనం అనేది ఎంతవరకూ తీసుకెళ్తుందో కల్కి విజయం చూపించింది. కొందరు బాహుబలి తర్వాత ప్రభాస్ మళ్లీ విజయం చూడడు అని అన్నారు. కానీ వాళ్ల అంచనాలు తారుమారయ్యాయి. ప్రభాస్ పెళ్లి విషయంలోనూ అదే జరుగుతుంది” అని ఆమె అనడం విశేషం.
దానికి కూడా టైమ్ రావాలని అని అన్నారు. “మేము కూడా అతడు పెళ్లి చేసుకోవాలనే కోరుకుంటున్నాం. కానీ సమయం రావాలి కదా. మేము ఆ నమ్మకంతోనే ఉన్నాం. పైనున్న కృష్ణంరాజుగారు అన్నీ చూసుకుంటారు. ఇప్పటి వరకూ అనుకున్నవన్నీ జరిగాయి. పెళ్లి కూడా కచ్చితంగా జరుగుతుంది” అని శ్యామలా దేవి చెప్పారు. నిజానికి గతేడాది కూడా ఆమె ప్రభాస్ పెళ్లి త్వరలోనే అన్నట్లుగా మాట్లాడారు. మరి ఆమె మాటలు ఎప్పుడు నిజమవుతాయో చూడాలి.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…