Nara Lokesh : చంద్రబాబు తనయుడు నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ప్రజల మనసు గెల్చుకుంటేనే తాను నాయకుడ్నిఅవుతానని టీడీపీ నేత నారా లోకేష్ చెబుతూ వస్తున్నారు. ప్రజల భవిష్యత్ను జాగ్రత్తగా చూసుకుంటేనే వారిని గెలుస్తానని చెప్పిన ఆయన… సంక్షేమం, అభివృద్ధి జోడెద్దుల బండిలా ముందుకు తీసుకెళ్తానంటూ వ్యాఖ్యలు చేశారు. టీడీపీ పాలనలో ఫ్యాక్షనిజానికి ఫుల్స్టాప్ పడిందన్నారు. టీడీపీ పాలనలో సీమలో చాలా మార్పు వచ్చిందని లోకేష్ తాజాగా పేర్కొన్నారు. వాటర్ గ్రిడ్ ద్వారా రాయలసీమలోని ప్రతి గ్రామానికి కుళాయి ద్వారా రక్షిత తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు.
ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ కంపెనీలకు సీమను కేరాఫ్గా మార్చుతామన్నారు. పాదయాత్రలో సీమ కష్టాలు చూశానని, వారి కన్నీళ్లు తుడుస్తానన్నారు. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ కారిడార్ల ద్వారా పారిశ్రామిక అభివృద్ధి చెందుతుందని లోకేష్ పేర్కొన్నారు. ఒకవైపు నారా లోకేష్ పలు హామీలు ఇచ్చుకుంటూ ముందుకు సాగుతుండగా, ఆయన ఎన్ని హామీలు ఇచ్చిన కూడా గెలవడం అసాధ్యం అంటూ జోస్యాలు చెబుతున్నారు. ఓ కామన్ మ్యాన్.. నారా లోకేష్ పై తన అభిప్రాయం తెలియజేస్తూ.. ఏది పడితే అది మాట్లాడితే నాయకుడు కారు. ఆయన వేరే వాళ్లు చులకన అయిపోతున్నారు అని అనుకుంటున్నాడు. కాని తానే అవుతున్నాడు.
ప్రతి నియోజక వర్గానికి పోవడం అక్కడ వాళ్లు పేపర్ ఏదో రాసి ఇస్తే దానిని బట్టి నాయకులని విమర్శించడం చేస్తున్నారు. జగన్ నీ మీద కోడిగుడ్లు వేయించాల్సిన అవసరం లేదని ఆ వ్యక్తి అన్నారు. జగన్కి, నీకు పోలిక పెట్టుకుంటే అది అవివేకం అవుతుంది. జగన్ చిటికిన వేలు కూడా పనికి రారు. దాడులు ఏమి పెరిగిపోలేదు. దాడులు చేయించాల్సిన అవసరం ఎవరికి లేదు. అభద్రతా భావంతో మీరు చేస్తున్న కామెంట్స్ ఎవరికి ఎఫెక్ట్ కావు. సినిమాలకి గ్యాప్ వచ్చినట్టుంది. అందుకే పవన్ కళ్యాణ్ మళ్లీ వస్తున్నాడు తప్ప ఆయన ఏం చేయలేడని విమర్శలు గుప్పించారు.
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…