CM YS Jagan : సిద్ధం స‌భ‌లో 15 ల‌క్ష‌ల మంది జ‌నం.. అంత మందిని చూసి చిందులేసిన జ‌గ‌న్..

CM YS Jagan : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. నాలుగో విడత సిద్ధం బహిరంగ సభను నిర్వ‌హించింది.రాష్ట్రంలో తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ పొత్తు అనంతరం రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిన నేపథ్యంలో సిద్ధం బహిరంగ సభను మరింత ఆసక్తికరంగా మార్చివేశాయి. అందరి దృష్టీ దీని మీదే నిలిచింది. బాపట్ల జిల్లా మేదరమెట్లలో జరిగిన సిద్ధం సభకు భారీగా ప్రజలు తరలివచ్చారు. మండుటెండలను సైతం లెక్క చేయకుండా తమ అభిమాన నేత సీఎం జగన్‌ను చూసేందుకు ఆయన చెప్పే మాటలను వినేందుకు ప్రజలు తరలి వచ్చారు. మొత్తంగా 15 లక్షల మంది సిద్ధం సభకు హాజరై గ్రాండ్ సక్సెస్ చేశారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

గ్రీన్ మ్యాట్ వేసి అక్కడ చాలామంది ప్రజలు వచ్చినట్లుగా టీడీపీ సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తోందని వైసీపీ నేతలు మండిపడ్డారు. అయితే అసలు జనాలు ఎంతమంది వచ్చారో ప్రత్యక్షంగా చూసేందుకు సభాస్థలికి రావాల్సిందిగా వైసీపీ ప్రతిపక్షాలకు సవాల్ విసిరింది. చివరి సభ కావడంతో పార్టీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సభను అనుకున్న విధంగానే సక్సెస్ చేసింది. దీంతో వైసీపీ క్యాడర్‌లో మరింత జోష్ పెరిగింది. సీఎం జగన్ తన ప్రసంగాన్ని ప్రారంభించగానే సీఎం సీఎం అనే నినాదాలు మిన్నంటాయి. దాదాపు గంటకు పైగా సాగిన సీఎం జగన్ ప్రసంగం పై అక్కడికొచ్చిన వారి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. తనను ఓడించేందుకు చంద్రబాబు అండ్ కో మరో జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకున్నారని.. అయితే తన పొత్తు మాత్రం ప్రజలతోనే ఉంటుందని సీఎం చెప్పినప్పుడు అక్కడికి వచ్చిన ప్రజలు చప్పట్లు కొట్టారు.

CM YS Jagan feel happy after seeing huge public in sidham meeting
CM YS Jagan

సభ ప్రారంభానికి ముందు ఓ డ్రోన్ కలకలం సృష్టించింది. దీనిపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. లోకేష్ ఇలాంటి ట్రిక్కులు ఎన్ని చేసినా వాటిని తొక్కిపడేస్తామని అనిల్ ధ్వజమెత్తారు.దమ్ముంటే సభాస్థలికి వచ్చి జగన్‌ను ప్రేమించే వారు ఎంతమంది వచ్చారో ప్రత్యక్ష్యంగా చూడాలని అన్నారు. అయితే టీడీపీ నాయ‌కులు దీనిని గ్రాఫిక్ షొ అంటున్నారు. స‌భ‌పై పలు విమ‌ర్శ‌లు కూడా గుప్పిస్తున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

6 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

1 day ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago