CM YS Jagan : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. తన కుటుంబ సభ్యులతో కలిసి విదేశాల్లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శనివారం లండన్ చేరుకున్నారు. శుక్రవారం రాత్రి 11 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో లండన్ చేరుకున్నారు. అయితే ముఖ్యమంత్రి జగన్ తన కుటుంబ సభ్యులతో కలసి బయలుదేరిన ప్రత్యేక విమానం నాలుగు గంటలు ఆలస్యంగా లండన్ విమానాశ్రయంలో దిగింది. షెడ్యూల్ ప్రకారం శనివారం ఉదయం 10.30 గంటలకు లండన్లోని లూటాన్ విమానాశ్రయంలో ఆ విమానం ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి ల్యాండింగ్కు అనుమతి లభించలేదు.
దీంతో ఆ విమానం 47 నిమిషాల పాటు గాల్లో చక్కర్లు కొట్టింది. అప్పటికి కూడా ఏటీసీ నుంచి అనుమతి రాకపోవడంతో నెదర్లాండ్స్లోని ఆమ్స్టర్డ్యామ్ ఎయిర్పోర్ట్లో దిగింది. దీంతో ఆమ్స్టర్డ్యామ్ ఎయిర్పోర్ట్లో మధ్యాహ్నం 1:30 గంటల వరకు సీఎం జగన్ కుటుంబ సభ్యులు అక్కడే ఉన్నారు. ఆ తర్వాత ల్యాండింగ్కు అనుమతి రావడంతో తిరిగి లండన్కు బయల్దేరారు. చివరికి మధ్యాహ్నం 2.30 గంటలకు లూటాన్ విమానాశ్రయంలో ఆ విమానం ల్యాండ్ అయింది. జగన్ కుటుంబం లండన్కు వెళ్లేందుకు కొలంబో నుంచి గురువారం విస్టా జెట్ కంపెనీకి చెందిన బొంబార్డియర్ 7500 విమానాన్ని గన్నవరం ఎయిర్పోర్ట్కు రప్పించారు.
లండన్, అక్కడి నుంచి యూకే, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ వెళ్లి చివరికి ఈ నెల 31 వ తేదీన తిరిగి తాడేపల్లికి రానున్నారు. అయితే ఫోన్నంబర్, ఈ-మెయిల్ వివరాలు అందించాల్సిందిగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎయిర్పోర్ట్లో మంత్రులు జోగి రమేష్, కొట్టు సత్యనారాయణ, ఎంపీ నందిగం సురేష్, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, సామినేని ఉదయభాను, మల్లాది విష్టు.. ఇతర వైసీపీ నేతలు ఆయనకు సెండాఫ్ ఇచ్చారు. లండన్ పర్యటన ముగించుకుని ఈ నెల 31న జగన్ తిరిగి విజయవాడకు చేరుకుంటారు. అయితే జగన్ ఎయిర్పోర్ట్లో చెకింగ్ సెక్షన్ లో చాలా సామాన్యుడిలా కనిపించారు. సెక్యూరిటీ వారు తనని చెక్ చేయకుండా పంపిస్తున్నా కూడా చెక్ చేయమని మరీ అడిగడం అందరిని ఆశ్చర్యపరచింది.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…